సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2021 నుంచి 2022 సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 2,62,501మంది పైసా ఖర్చులేకుండా ఖరీదైన వైద్య సేవలు పొందినట్లు గణాంక శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,33,196మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,04,113మంది, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో 25,192మంది రోగులు ఆరోగ్యశ్రీ సేవలు పొందినట్లు గణాంక శాఖ తన నివేదికలో వెల్లడించింది.
కేసీఆర్ కిట్స్..
గ్రేటర్ వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో 2021నుంచి 2022వరకు మొత్తం 45,936 మంది మహిళలు కేసీఆర్ కిట్స్ పొందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 36,600మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,903, మేడ్చల్ జిల్లా పరిధిలో అత్యల్పంగా 2,433 మంది మహిళలు కేసీఆర్ కిట్స్ పొందినట్లు గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది.