రాజేంద్రనగర్ : మైలారుదేవుపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. పల్లె చెరువు రోడ్డులో గురువారం తెల్లవారు జామున ఖాజా సోహెల్ అనే రౌడీ షీటర్ ను దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు. హత్య కు గురైన యువకుడు అబ్దుల్ రహూప్ గా గుర్తించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇదే ప్రాంతంలో హత్య జరిగి 12 గంటలు అయినా గడవకముందే నడిరోడ్డుపై మరో యువకుడి దారుణ హత్యకు గురవడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు గస్తీని పెంచి శాంతి భద్రతలను కాపాడాలని కోరుతున్నారు.