యాలాల, జనవరి 27: అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమనే నమ్మకంతోనే బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం తాండూరు పట్టణం 7వ వార్డు విజయనగర్ కాలనీకి చెందిన దాదాపు 50 కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఓరగంటి ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సంచార జాతుల సంఘం ఉపాధ్యక్షుడు ఓరగంటి సంజీవ, దానియాలు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.