రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్, రవాణా శాఖ జాతీయ రహదారులపై స్పీడ్గన్లను ఏర్పాటు చేసింది. 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్తే సంబంధిత వాహనదారులకు రూ.1035ల జరిమానా పడుతున్నది. వికారాబాద్ జిల్లాలోని బీజాపూర్ జాతీయ రహదారిపై నాలుగు చోట్ల స్పీడ్ గన్స్లను ఏర్పాటు చేసి వాహనాల వేగానికి కళ్లెం వేశారు. మన్నెగూడ, పరిగి, బొంరాస్పేట, కొడంగల్ ప్రాంతాల్లో స్పీడ్ గన్ యంత్రాలను ఏర్పాటు చేసి నిర్ణీత వేగానికి మించి వెళితే జరిమానాలను విధిస్తున్నారు.
గడిచిన రెండేండ్లలో వాహనదారులకు రూ.1.37 కోట్ల జరిమానాలు పడ్డాయి. 2022లో 12,398 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 9196 కేసులు నమోదయ్యాయి. వాహనం వెళ్లిన స్పీడ్, తేదీ, సమయం, ఎంత దూరం నుంచి ఫొటో తీసింది, స్పీడ్ లిమిట్, వెహికల్ లైసెన్స్, నంబర్ ప్లేట్ వివరాలతోకూడిన జరిమానా వివరాలను వాహనదారులకు నేరుగా ఇంటికి పంపిస్తున్నారు. గతంలో బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుండగా, ఎంతో మంది మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. స్పీడ్గన్స్ అమల్లోకి తీసుకురావడం వల్ల రోడ్డు ప్రమాదాలు చాలావరకు తగ్గాయి.
– వికారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలోని బీజాపూర్ జాతీయ రహదారిపై నాలుగు చోట్ల స్పీడ్గన్స్ ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేశారు. జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయనేది జిల్లా పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో గుర్తించారు. దీంతో అధికారులు జిల్లాలోని బీజాపూర్ హైవేపై వెళ్లే మన్నెగూడ, పరిగి, బొంరాస్పేట, కొడంగల్ ప్రాంతాల్లో స్పీడ్ గన్ యంత్రాలను ఏర్పాటు చేసి నిర్ణీత వేగానికి మించి వాహనాలు వెళితే జరిమానాలు విధిస్తున్నారు. ఈ యంత్రాలు ఏర్పా టు చేసిన తర్వాత వేగంగా వెళ్లే వాహనాలకు చెక్ పెట్టడంతో పాటు తరచూ జరిగే రోడ్డు ప్రమాదా ల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయి. హైదరాబాద్-బీజాపూర్ నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేసిన దృష్ట్యా వాహనాల వేగానికి చెక్ పెట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో స్పీడ్ గన్స్ అమర్చి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గుము ఖం పట్టేలా చర్యలు చేపట్టారు.
జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అతివేగంతోనే బీజాపూర్ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, చాలా మంది మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించడంతోపాటు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్గన్స్ను జిల్లా యంత్రాంగం అమల్లోకి తీసుకొచ్చిం ది. మరోవైపు ఔటర్ రింగ్రోడ్డుపై 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళితే సంబంధిత వాహనదారులకు జరిమానా విధిస్తుండగా బీజాపూర్ హైవేపై 60 కిలోమీటర్ల కంటే వేగంగా వె ళితే సంబంధిత వావానదారులకు జరిమానా విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే జిల్లాలోనూ వేగంగా వెళ్లే వాహనాదారుల నుంచి రూ.1035 జరిమానా వసూలు చేస్తున్నారు. 60 కిలోమీటర్ల వేగం కంటే అధిక వేగంతో వెళ్లే వా హనాల ఫొటోలు తీసి సంబంధిత వాహనదారు డి మొబైల్ నంబర్కు మెస్సేజ్ రూపంలో పంపిస్తున్నారు. సంబంధిత మెస్సేజ్లో వాహనం వెళ్లి న స్పీడ్, తేదీ, సమయం, ఎంత దూరం నుంచి ఫొటో తీసిందో, స్పీడ్ లిమిట్, వెహికల్ లైసెన్స్, నంబర్ ప్లేట్ వివరాలతో కూడిన జరిమానా వివరాలను వాహనదారులకు నేరుగా ఇంటికి పంపిస్తున్నారు. ఈ యంత్రాలతో పగటి పూటతోపా టు రాత్రి సమయాల్లోనూ వేగంగా వెళ్లే వాహనాలకు చెక్ పెట్టనున్నారు.
అయితే జిల్లాలో గత రెం డేండ్లలో నిర్ణీత వేగానికి మించిన వెళ్లిన వాహనదారులకు రూ.1,37,42,790 జరిమానాను జిల్లా పోలీసు యంత్రాంగం విధించింది. రెండేండ్లలో 21,594 కేసులు నమోదు చేసినట్లు సం బంధిత అధికారులు వెల్లడించారు. 2022 సం వత్సరంలో 12,398 కేసులు నమోదు చేసి రూ.1,27,89,930 జరిమానా విధించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 9,196 కేసులు నమోదు కాగా రూ.9,52,860ల జరిమానా విధించారు.
జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం వేసేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. స్పీడ్గా దూసుకెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం స్పీడ్గన్లు వినియోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన గరిష్ట వేగం దాటి ప్రయాణిస్తే స్పీడ్ గన్స్ ఇట్టే పట్టేస్తాయి. దీంతో చలానులను అధికారులు ఇంటికే పంపిస్తున్నారు.
స్పీడ్ గన్ యంత్రాల ద్వారా జిల్లా రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదంతో ఐదారుగురు మృత్యువాత పడిన ఘటనలుఉన్నాయి. గతంలో సగటున ఏడాదికి జిల్లావ్యాప్తంగా 400 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు అవగాహన కల్పించినా ప్రమాదా లు మాత్రం తగ్గలేదు. అయితే జిల్లాలో ఏర్పా టు చేసిన స్పీడ్ గన్ యంత్రాలతో వాహనాల వేగానికి కళ్లెం పడడంతోపాటు రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గాయి.
స్పీడ్ గన్ యంత్రంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతున్నది. పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనదారులకు విధించే జరిమానాలతో ప్రభుత్వానికి రె వెన్యూ వస్తున్నది. అయితే స్పీడ్ గన్స్ను అమల్లోకి తీసుకురావడంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు జరిమానాతో ఆదాయం చేకూరుతున్నది. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై కూడా చ ర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వా హనం నడిపితే జరిమానా విధించడంతోపాటు కేసు నమోదు చేయడంతోపాటు మద్యం సేవిం చి రెండు మార్లు పట్టుబడితే వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.