వికారాబాద్, మే 12: నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యా లయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాండూరు పట్టణంలో బుధవారం రాత్రి 11 గంటలకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై కాలం చెల్లిన పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న వారిని పెట్రో లింగ్ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వడంతో నకిలీ విత్తనాలు, కాలం చెల్లినవిగా గుర్తించారు. ఈ కేసులో కొడంగల్ నియోజకవర్గం అంగడి రాయచూర్ గ్రామానికి చెందిన నడిమింటి శ్రీని వాస్గౌడ్, అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కుర్వ మల్లేశంలను అదుపులోకి తీసుకు న్నారు. వీరిని విచారించగా కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాకు చెందిన శ్రీని వాస్గౌడ్ , మొగులప్పల నుంచి నాసిరకం, నిషేధిత పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇంటివద్ద సుమారు 700 ప్యాకెట్ల పత్తి విత్తనా లు లభ్యమయ్యాయన్నారు.మొత్తం 800 ప్యాకెట్లు, 360 కిలోలు నకిలీ విత్తనాలు లభించాయన్నారు. ప్రస్తుతం వీటి విలువ రూ. 6లక్షలు ఉంటుందన్నారు. సమావేశం లో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ పాల్గొన్నారు.