పరిగి, మార్చి 18 : రాష్ట్రంలోని 3,968 మంది సెర్ప్ ఉద్యోగులకు క్యాడర్తో పాటు పే స్కేల్ జీవో జారీ చేసినందుకు శనివారం పరిగిలో సెర్ప్ ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. తమకు క్యాడర్ ఇవ్వడంతోపాటు పే స్కేల్ వర్తింపజేసినందుకు వారు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి, ఏపీడీ నర్సింహులు, డీపీఎం రామ్మూర్తి, ఏపీఎంలు శోభ, సురేశ్, బందయ్య, ఆంజనేయులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
బంట్వారం : రాష్ట్రంలో పని చేస్తున్న సెర్ప్ సిబ్బంది వేతనాలను రెగ్యులరైజ్ చేస్తూ శుక్రవారం జీవో 11ను తేవడంపై సెర్ప్ మండల సిబ్బంది శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేసినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ప్రకాశ్గౌడ్, ఏపీఎం దేవయ్య, సీసీలు అరుణ్, నర్సింహులు, లక్ష్మయ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ : రాష్ట్రంలోని సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పేస్కేల్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం మండలంలోని సెర్ప్ ఉద్యోగులు మండల మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సెర్ప్ ఉద్యోగులకు కనిష్ట పే స్కేల్ రూ. 19వేల నుంచి రూ. 58.850 కాగా, గరిష్ట పే స్కేల్ రూ. 51,320 నుంచి రూ. 1.27లక్షలుగా నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పేస్కేల్ వర్తించనుండగా, ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్దేముల్ : రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని జిల్లా ఎల్1ఎల్2 అధ్యక్షుడు కె.సత్యనారాయణ అన్నారు. శనివారం తాండూరులోని సెర్ప్ క్లస్టర్ కార్యాలయంలో సెర్ప్ సిబ్బందితో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కె.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు నాలుగు వేల మంది సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను అమలు చేస్తామని హామీ ఇచ్చి అందుకు సంబంధించిన జీఓ నంబర్ 11ను జారీ చేసి ఉద్యోగులకు పేస్కేల్ను ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. కార్యక్రమంలో పెద్దేముల్ ఏపీఎం బాలయ్య, తాండూరు ఏపీఎం ఆనంద్, కార్యదర్శి ఎం.ప్రభు, సీసీలు సత్యనారాయణ, వెంకటేశ్, సయీద్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న సెర్ఫ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఏపీఎం యాదగిరి ఆధ్వర్యంలో సెర్ఫ్ ఉద్యోగులు, మహిళ సమాఖ్య సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నో రోజుల ఎదురు చూస్తున్న తమ డిమాండ్ను సీఎం కేసీఆర్ నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం యాదరిగి, సీసీలు అరుణ, అనురాధ, రజిని, యాదయ్య, మహిళ సమాఖ్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.