భోపాల్: కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాంతో వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది అనవసరంగా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. దాంతో అలాంటి వారికి పోలీసులు వినూత్న రీతిలో అక్కడికక్కడే పనిష్మెంట్ ఇస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోనూ అలాంటి ఘటనే జరిగింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని నర్మదా ఘాట్లో కొంతమంది లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సామూహికంగా ఈతలు కొడుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఉల్లంఘనులను వినూత్న శిక్షి వేశాఉ. అందరినీ వరుసగా నిలబెట్టి గుంజీలు తీయించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.