తెలుగు మాసాల్లో ఆషాడానికి ప్రత్యేక స్థానమున్నది. చంద్రుడి గమనాన్ని బట్టి నెలల పేర్లు నిర్ణయించారు. చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాల సమీపానికి ప్రవేశించినపుడు ఈ నెలను ఆషాడం అంటారు. తెలుగు మాసాల్లో ఇది నాలుగోనెల.
ఆషాడంలో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తా డు. అలాగే ఈ మాసంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది. హిందువులు మంచి పని చేయాలంటే దశమి, ఏకాదశి తిథులను పాటిస్తారు. ఏడాది పొడవున ఉండే 24 ఏకాదశుల్లో వర్ష కాలంలో వచ్చే మొదటి ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
సాధారణంగా ఆషాడాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఎలాంటి శుభకార్యాలు, వేడుకలు తలపెట్టరు. అయినప్పటికీ ఆషాడం పూజలు , వ్రతాలకు అత్యంత శ్రేష్ఠమైందని నమ్మకం. ముఖ్యంగా అమ్మవారినీ, ఈశ్వరుడినీ, విష్ణుమూర్తినీ అర్చించాలని చెబుతుంటారు. సతీ సక్కుబాయి ఈ రోజే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరునాడు ద్వాదశి రోజు విష్ణు మూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఉపవాసం మానసిక, శారీరక చైతన్య ప్రతీక. హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశితో పర్వదినాలు ప్రారంభమవుతాయి.
ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి పదకొండు. మనిషి వీటన్నింటినీ ఆధీనంలోకి తీసుకొని దైవారాధన చేయడం ఈ ఏకాదశ ఉపవాస దీక్ష ముఖ్య ఉద్దేశం. పురాణాల ప్రకా రం శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో శేష తల్పంపై నాలుగు నెలలు శయనించి తిరిగి ప్రభోదిని ఏకాదశి రోజున మేల్కొంటాడని పండితులు చెబుతారు. ఈ నాలుగు నెలలు విష్ణువు పాతాళ లోకంలో బలి చక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని నమ్మకం. ఈ నాలుగు నెలలు కొంతమంది చాతుర్మాస దీక్ష చేబడుతారు. ప్రస్తుతం మఠాధిపతులు, స న్యాసం స్వీకరించిన వారు చా తుర్మాస దీక్ష పాటిస్తున్నారు.
తొలి ఏకాదశి రోజు పేలా లు తినడం ఒక ఆచారం. పేలాలు పితృదేవతలకు ప్రీతి ప్రాయం. మనకు జన్మ నిచ్చిన వారిని తలచుకోవడం మన బాధ్యత. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వచ్చే వర్షకాలం శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోసం పేలాలు వేడి కలుగజేస్తాయి. కనుక దేవాలయాల్లో ఇండ్ల ల్లో ఆ రోజు పేలాల పిండిని ప్రజలు ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఆషాడ మాసంలో మన శరీరానికి జడత్వం వచ్చి అనేక వ్యాధులు వస్తుంటాయి. అందుకోసమే ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే జీర్ణకోశం శుభ్రపడి దేహానికి ఉత్తేజం వస్తుందని నమ్ముతారు. కనుక మతాచారం వెనుక ఆరోగ్య సూత్రం దాగి ఉంద ని ప్రజలు నమ్మిక తోనే ఉపవాసం ఉంటా రు.
-ఆళవందార్ వేణు మాధవ్ 86860 51752