దేవుడి విగ్రహాలను తాకే అదృష్టవంతులు అర్చకులు! కానీ వారి ఆర్థిక పరిస్థితులను కళ్లారా చూస్తే హృదయం కలిచివేస్తుంది. అలాంటి దేవుడి సేవకుల కష్టాలను సహృదయంతో అర్థం చేసుకొని చిన్న చిన్న దేవాలయాల ధూప, దీప నైవేద్యాల అలవెన్సులను రూ.10 వేలకు పెంచారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్ల నేడు అర్చక కుటుంబాలు గౌరవంగా, ఆర్థిక భారం లేకుండా జీవిస్తున్నాయి. ఇలాంటి కారణజన్ముడు ఈ గడ్డను ఇంకా ఎన్నో సంవత్సరాలు పాలించాలని, అప్పుడే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, క్షేమంగా జీవిస్తారని భావించి, కేసీఆర్కు భగవంతుని ఆశీస్సులు ఉండాలని అర్చకులంతా కోరుకుంటున్నారు.
మన రాష్ట్రంలో సరైన ఆదరణ లేని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఎవరూ పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా అర్చకులు మాత్రం రోజూ వీటిలో ధూప, దీప నైవేద్య సేవలు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అర్చకులే వీటికి ఖర్చయ్యే ఆర్థిక భారాన్ని మోస్తారు. నేనొక చాత్తాద శ్రీవైష్ణవ సామాజిక వర్గంలో జన్మించాను. కాబట్టి అర్చకుల కష్టాలను దగ్గరుండి చూశాను. అందులో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి దేవుడి సేవలో నిమగ్నమైనవారు ఎంత కష్టమొచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని విడిచిపెట్టరు.
మనలో చాలా మంది రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల గురించి మాత్రమే తెలుసు. ఊళ్లలోని చిన్న చిన్న గుడులు ఎవరు నిర్వహిస్తున్నారు? తీర్థ ప్రసాదాల ఖర్చు ఎవరు భరిస్తున్నారు? దేవాలయ ప్రాంగణాన్ని ఎవరు శుభ్రం చేస్తున్నారు? అని ఆలోచన చాలా మంది చెయ్యారు. కానీ మన సీఎం కేసీఆర్ కానీ మన ముఖ్యమ్రంతి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి మన దేవాలయాలను కాపాడుకోవాలని, అర్చకులకు చేయూతనివ్వాలని సంకల్పించారు. గతంలో ధూప, దీప నైవేద్యాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రతి దేవాలయానికి రూ.6 వేల రూపాయల అలవెన్స్ ఇచ్చి కొన్ని వేల అర్చక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే రోజు రోజుకూ పెరుగుతున్న ఖర్చులని అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఇటీవల ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచారు.
భగవంతుడి సేవచేసే అర్చకుల కష్టాలను తీర్చిన కేసీఆర్కు అర్చక సమాజం ఎన్నో కృతజ్ఞతలు తెలిపింది. ఆయన పది కాలాలపాటు బాగుండాలని ప్రార్థనలు చేసింది. ఇలాంటి కారణజన్ముడు ఈ గడ్డను ఇంకా ఎన్నో సంవత్సరాలు పాలించాలని, అప్పుడే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, క్షేమంగా జీవిస్తారని భావించి, కేసీఆర్కు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ సాయం కారణంగా అర్చకులు గౌరవంగా, ఆర్థిక భారం లేకుండా వృత్తి పట్ల మరింత మక్కువతో బాధ్యతగా పని చేస్తున్నారు. నేడు భారతదేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడకు వెళ్లినా కేసీఆర్ లాంటి నిజమైన హిందూ బంధువును మనం చూడలేము.
ఎంతో మంది నేతలు మాటల వరకే పరిమితమయ్యారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ మతాన్ని నిజంగా అర్థం చేసుకొని గౌరవించే కేసీఆర్ లాంటి వారికే మతం అసలు విలువ తెలుస్తుంది. అలాంటివారు ఇతర మతాలను గౌరవిస్తారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)