దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ , గద్వాల, నారాయణపేట్ జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో వంద ఎంబీబీయస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో మరో 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రం ఆవిర్భంచిన తొమ్మిదేండ్లలోనే 29 ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. 2014 నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థినీ విద్యార్థులు ఎంసెట్ ఎంట్రెన్స్లో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ మెడికల్ కాలేజీల్లో సీట్లు దొరకక, వేరే రాష్ర్టాలకు వెళ్లేవారు. ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి డబ్బు లు లేక పేద విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా మన దగ్గర క్యాలిఫైడ్ డాక్టర్లు లేక, మండల కేంద్రాల్లో సైతం ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు మాత్రమే దిక్కయ్యేవారు. పేద, మధ్య తరగతి ప్రజ లు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ వద్దకు వెళ్ళాలంటే జిల్లాకేంద్రం లేదా హైదరాబాద్ రావలసి వచ్చేది. దీంతో పేదలు బస్సు చార్జీలు పెట్టలేక అందుబాటులో ఉండే డాక్టర్ల వద్దకు వెళ్ళేవారు. ఆనాడు ప్రజలకు జిల్లా కేంద్రంలో కూడా ముఖ్యమైన పరీక్షలైన స్కానిం గ్, టీఎంటీ పరీక్షలు అందుబాటులో ఉండేవికావు. పదేండ్ల క్రితం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రభుత్వ దవాఖానా ల ప్రగతి కండ్లముందు కనబడుతుంది.
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు తెలంగాణ బిడ్డలకు వైద్య విద్యను చేరువ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయన చొరవతో తొలి విడతగా మహబూబ్నగర్, సిద్ధిపేట, నల్లగొండ, సూర్యాపేటలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. నిరుడు 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలు పెట్టగానే పూర్తి సౌకర్యాలు ఒకేసారి రాకపోవచ్చు, కానీ రెండు మూడేండ్లలో అన్ని వసతులు అందుబాటులోకి వస్తా యి. 9 కాలేజీలు ప్రారంభమైతే రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తా యి. మిగతా 8 జిల్లాల్లోనూ తాజాగా మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. దీంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరనున్నది.
1. విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కల ఉన్న ప్రతిభావంతులు వేరే ప్రాంతాలకు వెళ్ళకుండా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
2. కాలేజీకి అనుబంధంగా దవాఖాన ఉండటం వల్ల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం దొరుకుతుంది.
3. సమాజంలో క్వాలిఫైడ్ డాక్టర్ల సంఖ్య పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
4. దవాఖానల సంఖ్య పెరిగితే ప్రజలు వందల కి.మీల దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి దగ్గరలో వైద్యం దొరికే అవకాశం ఉంటుంది.
5. గతంలో ముఖ్యమైన వైద్యపరీక్షలకు ఆదిలాబా ద్, ఖమ్మం మొదలైన దూరప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేవారు. ప్రస్తుతం జిల్లా కేం ద్రంలోనే స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటం వల్ల అక్కడే చికిత్స పొందగలుగుతారు.
అత్యవసర సమయాల్లో సేవలందించే 466 కొత్త 108 వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 1న ప్రారంభించారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో 204 అంబులెన్సులు, 228 అమ్మఒడి, 34 పార్థ్థీవ వాహనాలకు జెండా ఊపారు. దవాఖానాల అప్ గ్రేడేషన్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నగరం నలువైపులా నాలుగు టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ ద్వారా ప్రభుత్వ వైద్య సేవ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50వేలకు పెరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 108 అంబులెన్స్లు 316 ఉండగా, ఇప్పుడు ఆసం ఖ్య 455కు పెరిగింది. గతంలో నవజాత శిశువుల కోసం అంబులెన్స్లు లేవు, ఇప్పుడు జిల్లాకు ఒకటి ఏర్పాటుచేశారు.
ప్రజలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను తీసుకురావడానికి టిమ్స్ దవాఖానాల ఏర్పాటు కోసం ‘టిమ్స్యాక్ట్-2023’ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ఇటీవల శాసనసభ ఆమోదం పొందింది. 1000 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఎయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తిగల వైద్య విజ్ఞాన సంస్థ, స్పెషాలిటీ-సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించటంతో పాటు , వైద్యవిద్య, 16 స్పెషాలిటీ, 15 సూప ర్ స్పెషాలిటీలలో పీజీ కోర్సులు, పారామెడికల్ విద్య, గుండె, కిడ్నీ, లివర్, మెదడు, ఊపిరితిత్తుల వంటి 30 విభాగాలు ఈ దవాఖానలో ఏర్పాటు చేసి ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందించడానికి ఈ బిల్లు ను ప్రవేశపెట్టి ఆమోదించు కోవడం గమనార్హం.
ఇప్పటికే సీఎం కేసీఆర్ నాయకత్వంలో 3002 పల్లె దవాఖానాలు, 434 బస్తీ దవాఖానాలు, మండలానికి నియోజకవర్గానికి వందపడకల దవాఖానను, జిల్లాకో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నామని ఇటీవల జరిగిన అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలియజేశారు. రూ.30 కోట్లతో ఏర్పాటు చేసిన రోబో ఎక్విప్మెంట్ సర్జరీలు నిమ్స్ దవాఖానలో జరుగుతున్నాయి.
దేశంలోని కొత్త మెడికల్ సీట్లు 2200 కాగా వాటిలో తెలంగాణలోనే 900 సీట్లు అనగా 43శాతం ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22,455 మంది వైద్యసిబ్బందిని భర్తీ చేసింది. ఇంకా 5204 స్టాఫ్ నర్సులు, 1520 ఏఎన్ఎంలు, 156 ఆయూష్ డాక్టర్ల భర్తీ కొనసాగుతున్నది.
2014లో ఉన్న 2850 ఎంబీబీఎస్ సీట్లు, 2023 నాటికి 8515 సీట్లుగా, 2014 ఉన్న 1183 పీజీ సీట్లు 2023లో 2869 సీట్లుగా అందుబాటులోకి వచ్చాయి. 2013-14 వైద్యశాఖకు రూ.2706 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ. 12,364 కోట్లు కేటాయించింది. పభు త్వం అందిస్తున్న వైద్యసేవలను ప్రజ లు ఆదరించి, వినియోగిస్తే, మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
(వ్యాసకర్త : విశ్రాంత ప్రధానాచార్యులు)