హైదరాబాద్ అంటే చార్మినార్. గోల్కొండ కోట. ఫలక్నుమా ప్యాలెస్. చౌమహల్లా ప్యాలెస్. కింగ్కోఠి. గండిపేట. హుస్సేన్సాగర్ ఇత్యాది చిహ్నాలే కాదు.. హైదరాబాద్ అంటే ఇప్పుడు నూతన సచివాలయం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. తెలంగాణ అమరవీరుల స్మృతివనం కూడా.
అవును, నిజం. చరిత్ర వర్తమానాన్ని వాగ్దానం చేసింది. వర్తమానం భవిష్యత్కు వారధి కట్టింది. అదేపనిగా ఆరోపణలు చేయటం, నిందలు వేయటమే పనిగా పెట్టుకున్న వర్గం నిజాలను అంగీకరించలేని దుస్థితిలో నిరాశావాదాన్ని పరివ్యాప్తం చేస్తున్నది. వాస్తవాలను గ్రహించలేని వాతావరణాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నది. అస్తిత్వ ఉనికి వేటలో కూరుకుపోతున్న ఆ వర్గం నిజంగానే వెగటు పుట్టిస్తున్నది. అయినంతమాత్రాన భవిష్యత్తుకు వంతెన కట్టిన నిర్మాణాలు వినిర్మాణాలుగా మిగిలిపోవు. అవి వర్తమానపు చిహ్నాలైనా, భవిష్యత్కు ప్రగతి వైభవ దీప్తులుగా మిగిలిపోతాయి. దేశంలో వ్యవస్థల వినిర్మాణం, విలువల విధ్వంసం చెలరేగిపోతున్న సందర్భంలో తెలంగాణ భారతదేశానికి నూతన నిర్మాణ నమూనాను పరిచయం చేస్తున్నది.
మనసులో కీర్తిస్తూ మనిషిగా వెక్కిరించాలనే దురవస్థ నెలకొనటమే నడుస్తున్న చరిత్ర. అదే అసలైన విషాదం. తెలంగాణ అస్తిత్వం కోసం నూతన ఉద్యమం నిర్మాణమవుతున్నప్పుడు అచ్చం ఇటువంటివే రాజ్యమేలాయి. మేడిగడ్డ దగ్గర కాళేశ్వరానికి పునాదిరాయి పడ్డప్పుడు ఇలాంటి వెక్కిరింతలే మంటలు రేపాయి. కానీ, మూడేండ్ల వ్యవధిలోనే కాళేశ్వరం పూర్తయి దేశానికే సరికొత్త జల సందేశాన్ని అందించిన తర్వాత నోళ్లు మూతపడ్డాయి. యావత్ భారతాన్ని ప్రభావితం చేసే ప్రతీకలుగా నూతన సచివాలయం, అమరవీరుల స్మృతి చిహ్నం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దేశం గర్వించేలా తెలంగాణ నిర్మించింది. విశ్వనగరిగా భాసిల్లుతున్న చారిత్రక హైదరాబాద్కు నవ నిర్మాణాలు నగిషీలు తొడిగాయి. అవ్వల్దర్జా హైదరాబాద్కు షాన్దార్ శోభనిస్తున్నాయి. భవంతులు బతుకులు మార్చవని నోరు పారేసుకునేవాళ్లకు ‘హమ్ కిసీసే కమ్ నహీ’ అని హైదరాబాద్ గల్లా ఎగరేసి సమున్నత శిఖరాలుగా నిలబడుతున్నాయి. హైదరాబాద్కు వచ్చే ప్రతీ ఒక్కరూ చార్మినార్తోపాటు తప్పక చూడవలసిన నిర్మాణాలుగా ఖ్యాతి ని పొందనున్నాయి.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, అమరవీరుల స్మృతిచిహ్నం.. ఈ రెండింటి మధ్య ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం కూర్పు వెనుక ఆంతర్యాన్ని, అంతస్సూత్రాన్ని గ్రహిస్తే గానీ, తెలంగాణ నేపథ్యం.. దాని భవిష్యత్ దార్శనికత అర్థం కావు. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని, ఆ కల సాకారం కోసం ఆత్మత్యాగాలు చేసిన అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర సచివాలయం పనిచేయాలనే దృఢమైన సంకల్పం దాగి ఉన్నదని ప్రభుత్వం సంకేతాత్మకంగా సందేశాన్నిచ్చిం ది. సచివాలయం నిర్మాణ దశలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. నూతన సచివాలయానికి అం బేద్కర్ పేరు పెట్టాలని, 125 అడుగుల విగ్రహం నిర్మించాలని రాష్ట్రంలో ఏ సంఘ మూ సర్కారును కోరలేదు. ఏ అంబేద్కర్వాదీ ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించలేదు. బీఆర్ అం బేద్కర్ను రాజ్యాంగ నిర్మాతగానే కాదు జాతి నిర్మాతల్లో అత్యం త కీలకమైన దార్శనికుడి గా తెలంగాణ స్వీకరించింది. ఆ మహనీయు డి ఆశయాలను కొనసాగించే వేదికగా తెలంగాణ నిలిచితీరుతుందని కేసీఆర్ తన ఆచరణ ద్వారా విస్ప ష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో (జూన్ 14, 2014న) ‘ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టిన త్యాగధనుల అమరత్వం అజరామరం. వారి త్యాగనిరతిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరవదు. వారి త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం’ అని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
‘కనుపాపా చూపుల్లా/ కన్నీటి పాటల్లా/ ఎన్నీలా దీపాల వెలుగులైనోళ్లకు/ ఏటిపాయల నీటి ఊటలా జోహార్/ గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్/ చిలుకలా జోహార్/ వరి మొలకలా జోహార్’… ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైనవారికి నందిని సిధారెడ్డి అక్షర నివాళిగా రాసిన పాట. ఉద్యమ సమయంలో ఈ పాట వినని ఊరు లేదు. పాడని గొంతు లేదు. అలాగే 1969 తెలంగాణ ఉద్యమం లో అసువులు బాసిన అమరుల త్యాగాలకు సమైక్య పాలకులు నివాళి అర్పించరనే దూరదృష్టితో ఎక్కా యాదగిరిరావు రూపొందించిన అమరవీరుల స్థూపం (గన్పార్కులోనిది) ప్రారంభానికి నోచుకోకపోయినా తెలంగాణ సమాజం ఇప్పటికీ దాన్ని తమ స్ఫూర్తి కేంద్రంగానే భావిస్తున్నది. అమరత్వం రమణీయమైనదే కాదు, అది భవిష్యత్ తరాలకు కమనీయం, కవననీ యం. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి పోరాడిన అమరుల త్యాగం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు సమున్నతంగా నిలవాలని కేసీఆర్ ప్రభు త్వం సంకల్పించింది. ఫలితంగానే సచివాలయానికి ఎదురుగా తెలంగాణ అమరుల స్మృతిచిహ్నాన్ని నిర్మించింది.
రాష్ట్రంగా ఆవిర్భవించకముందు శిలాఫలకాలపై మాత్రమే అభివృద్ధిని చెక్కిన చరి త్ర తెలంగాణది. కానీ, శిల్ప సదృశ్యమైన నిర్మాణాలు తెలంగాణకు కీర్తి కిరీటాలు తెచ్చిపెడుతున్నాయి. సర్వజన, సామూహిక సమానత్వ, సాధికారత భావనను పాలనలో, ఆచరణలో చిత్తశుద్ధితో పాటిస్తామని తెలంగాణ అనతికాలంలోనే నిరూపించిం ది. ‘నీ ఇంటి ముందు ఒక ప్రపంచాన్నే నెలకొల్పుతాను. నీ ఇంటిముందు మరో ఇంటి నే నిర్మిస్తాను. నిర్మించిన ఆ ఇంటి వాకిట్లో తారల తోరణాలు వ్రేలాడదీస్తాను’ (తేరే ఘర్ కే సామ్నే/ దునియా బసావూంగా/ తేరే ఘర్ కే సామ్నే/ ఏక్ ఘర్ బనావూం గా/ తారే సజావూంగా/ తేరే ఘర్ కే సా మ్నే) అని ఆ పాత మధురగీతం ఆలాపన ను ఆచరించి చూపిన పాలకుడు కేసీఆర్.
ఆకలికి అలమటించిన నేల తెలంగాణ.. ఇప్పుడు దేశానికి అన్నం పెడుతున్నది. అంతేకా దు నిలువెత్తు స్ఫూర్తిని దేశానికి నింపుతున్న గడ్డ కూడా తెలంగాణేనని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంగా ఆవిర్భవించకముందు శిలాఫలకాలపై మాత్రమే అభివృద్ధిని చెక్కిన చరి త్ర తెలంగాణది. కానీ, శిల్ప సదృశ్యమైన నిర్మాణాలు తెలంగాణకు కీర్తి కిరీటాలు తెచ్చిపెడుతున్నాయి. సర్వజన, సామూహిక సమానత్వ, సాధికారత భావనను పాలనలో, ఆచరణలో చిత్తశుద్ధితో పాటిస్తామని తెలంగాణ అనతికాలంలోనే నిరూపించింది.
– నూర శ్రీనివాస్
91827 77011