దేశంలోని శూద్రులు, అతిశూద్రులను దారుణమైన స్థితి నుంచి బయటపడేయటానికి రాజ్యాంగం రక్షణగా నిలబడినప్పటికీ 77 ఏండ్ల స్వతంత్ర భారత్లో బీసీల విషయంలో కూడా రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అసెంబ్లీ, పార్లమెంట్లలోకి పోయే అవకాశాలు లేక బీసీల గోడును పార్లమెంటు వేదిక మీద నేటికీ చాటిచెప్పే స్థితి లేకుండాపోయింది. ఈ కోణం నుంచే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని చూడాలి.
నేపథ్యం నుంచే 2014, జూన్ 2 తర్వాత తెలంగాణలో జరిగిన పునర్నిర్మాణంలో బీసీ సామాజి క వర్గాలను అన్నిరంగాల్లోకి నిలిపేందుకు జరిగిన కృషిని లెక్కగట్టాలి. గత పదేండ్లలో బీసీల అభ్యున్నతి కోసం కేసీఆర్ చేసిన కృషిని తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఈ వర్గాలను నిలబెట్టేందుకు పడ్డ తపనను అంచనా కట్టి చూడాలి. ఆ కోణంలో విశ్లేషణ చేయకుండా రాజకీయ కోణాల నుంచే గత పదేండ్ల పునర్నిర్మాణాన్ని చూస్తే బీసీలను భ్రమింపజేసినట్టుగానే భావించాలి.
బీసీ కులా లు నిలదొక్కుకునేందుకు ఆసరాగా బర్లు, గొర్ల పంపిణీ, గీత, చేనేత, మత్స్యకార్మికులకు ప్రమాద బీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత విద్యుత్తు, ఆధునిక లాం డ్రీలు, ధోబీఘాట్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్నీ బీసీ కులాలకు ఆసరా అయ్యాయి. మాంసం, మత్స్య, పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
ఇట్లా అనేకానేక పథకాలు బీసీలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపయోగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలున్నారు. అంటే సగం తెలంగాణ గురించి మాట్లాడాలి. సగం తెలంగాణ సమాజానికి సంబంధించిన విషయంగా బీసీ కులాలను చూసి మాత్రమే పదేండ్ల పునర్నిర్మాణాన్ని చూడాలి. అందులో కేసీఆర్ తక్కువకాలంలో ఆ వర్గాలకు చేసిన కృషిని వెలికితీసి లెక్కగట్టాలి. దేశంలో 77 ఏండ్లుగా బీసీలను బలి పశువులను చేసి, రాజ్యాంగబద్ధంగా ఏ హక్కుల్లేకుండా చేసిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్, బీజేపీలది. అం దులో తెలంగాణ మినహాయింపు కాదు. కేవలం పదేం డ్ల కాలంలోనే కేసీఆర్ పునర్నిర్మాణాన్ని పరుగులు తీయించే పనులు చేపట్టారు. ఇందులో సగభాగమైన 2 కోట్ల మంది బీసీలను అన్నిరంగాల్లోకి తేవటానికి కింది నుంచి ప్రారంభమైన కృషిని తప్పనిసరిగా అంచనా కట్టిచూడాలి.
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకొంటూ తెలంగాణను తీర్చిదిద్దుకునే క్రమంలో బాగా చితికిపోయిన గ్రామాన్ని బతికించాలి. గ్రామం పచ్చబడటమంటే మొత్తం గ్రామీణ తెలంగాణ రూపురేఖలు మారాలి. ఉత్పత్తి కులాలు గ్రామంతో ముడిపడి ఉన్నాయి. గ్రామం పచ్చబడితేనే, ఊరు ఊపిరి తీసుకుంటేనే బీసీల పొయ్యిలు రాజుకుంటాయి. బీసీలు బతుకటానికి, నిలవటానికి ఆసరా లేకుండా పోయిన భయంకరమైన దుస్థితిలో ఉన్న తెలంగాణను తీర్చిదిద్దుకోవటం కోణం నుంచి తెలంగాణ పునర్నిర్మాణాన్ని అంచనా కట్టి కేసీఆర్ కృషిని అంచనా వేస్తే ఏం జరిగిందో అవగతమవుతుంది. అధికార పీఠాల మార్పిడి కోసం ఇప్పటికీ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, అందుకు కొన్ని పడిగట్టు పదాలను పట్టుకొని విమర్శల మంటలు లేపుతున్నారు. ఆ రాజకీయ విమర్శల కోణంలో కొనసాగుతూ పదేండ్ల పాలనకు గంతలు కట్టి చూస్తే పునర్నిర్మాణ దశలో జరిగిన కృషిని అంచనా వేయలేరు.
ఇంత తక్కువ కాలంలో ఇంతగా తెలంగాణను అభివృద్ధి చేసింది మాత్రం కేసీఆరేనని మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు గాంభీర్యంగా రాజకీయ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలే బీసీలను అత్యంత దారుణంగా అణగదొక్కాయి. దాని నుంచి బీసీలను బైటకు తేవటానికి పదేండ్ల తక్కువ కాలంలో బీసీల అస్తిత్వం దగ్గరికి పోయి కేసీఆర్ మొదలుపెట్టిన కృషి ఆహ్వానించదగినది. బీసీలను వెనుకబాటుతనం నుంచి బైట పడేయడమనేది ఒకరోజు లో జరిగే పనికాదు. అందుకు కొంతకాలం మిషనరీగా పనిచేయాలి. ఆ పనిని బీఆర్ఎస్ మొదలుపెట్టింది.
వలసలను ఆపిన చరిత్ర బీఆర్ఎస్ది. బతుకుదెరు వు కోసం తెలంగాణ నుంచి భారీగా వలసలు పోయా రు. ‘ముంబయి, బొగ్గుబాయి, దుబాయి’కి తెలంగాణ బిడ్డలు వలసలు పోయే దుస్థితి భయంకరమైనదని ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పారు. రాష్ట్ర అవతరణ తర్వాత వలసలు పోకుండా చేసేపని మొదలైంది. ఒకరకంగా వలసలు పోయినవారు తిరిగొచ్చే స్థితి వచ్చింది. వలసలు పోయిన కూలీలు తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకునే దశ వచ్చిం ది. చెరువులు నిండటం, కాళేశ్వరం జలాలు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి మారుమూల, చివరి గ్రామా ల చెరువులను నింపడంతో పల్లెలు పచ్చబడ్డాయి. వలసలు ఆగాయి. ఇక్కడే ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఈ వలసలు పోయినవారంతా బీసీలేనని గుర్తించాలి. ఇందుకు సంబంధించిన గణాంకాలు తీసి చూస్తే నిజం బయటపడుతుంది. ఉత్పత్తి కులాలకు చెందిన బీసీలంతా చేతివృత్తులు చితికిపోయి పొట్టచేత పట్టుకొని పట్నం బాట పట్టారు. ఈ పనిని తెలంగాణ రాకముందు ఏలిన ఏలికలు పట్టించుకొని ఉంటే ఊరు వలసపోయేది కాదు. చేతివృత్తులు చితికిపోయేవి కావు. గ్రామీణ తెలంగాణ బాగుపడితే సగభాగంగా ఉన్న బీసీల బతుకులు బాగు పడతాయన్న ఆలోచన చేసిన ప్రభుత్వంగా ఆ దిశగా అడుగులు వేసి దారులు వేసింది మాత్రం తొలి తెలంగాణ ప్రభుత్వమేనని ఘంటా పథంగా చెప్పవచ్చు.
గురుకులాలు రేపటి సామాజిక మార్పునకు కేంద్రాలు: బీసీలు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని అందరూ చెప్తున్నారు. వీళ్లు ఎదగాలంటే జ్ఞాన పునాది బలంగా ఉండాలి. బీసీలు బాగా చదువుకోవాలి. నాణ్యమైన విద్య అందాలి. తెలంగాణ రాకముందు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే పురుగులన్నం పెట్టే కంచాలుగా మారాయి. ఆర్.కృష్ణయ్య తన జీవితంలో సగభాగాన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బాగు కోసమే వెచ్చించారు. ఈ స్థితి మారాలనే తలంపుతో గురుకులాలను కార్పొరేట్ విద్యనందించే స్థాయికి తీసుకుపోయిన ఖ్యాతి కేసీఆర్కు దక్కుతుంది. ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్లలో మంచి ర్యాంకులను గురుకులాల విద్యార్థులు పొందే స్థాయికి వచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటుచేసింది. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మా విద్యారంగాల్లోకి గురుకులాల విద్యార్థులు భారీగా వెళ్తున్నారు. ఇవి బడుగుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చుతాయి. ఇప్పుడు తెలంగాణ గురుకులాల నుంచి రాబోయే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలు రేపటి సివిల్ సర్వీస్ పరీక్షల్లో నెగ్గే దశకు వచ్చి తీరుతారు. సాఫ్ట్వేర్ రంగాలను ఆక్రమించేస్తారు. బడుగులు కూడా అన్ని రంగాల్లోకి తమ బిడ్డలు ఎదగాలని కోరుకుంటారు. అందుకు తొలి తెలంగాణ ప్రభుత్వంలో దారులు పడ్డాయి.
బీసీలకు ఆత్మగౌరవ భవనాలు: హైదరాబాద్ నగరంలో 47 బీసీ కులాలకు అత్యంత విలువైన స్థలాలను కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు పూనుకున్నది. ఇవి బీసీ కులాల అభ్యున్నతికి, వారి పురోభివృద్ధికి పరిశోధనా కేంద్రాలుగా నిలవాలన్న దీర్ఘకాలిక తలంపుతో కేసీఆర్ ఈ పనికి పూనుకున్నారు. బీసీలు తమ బిడ్డల చదువులు, తమ కులవృత్తుల ఆధునీకరణలు, అన్నిరంగాల్లోకి తమ బిడ్డలు వెళ్లేందుకు ఆలోచనా కేంద్రాలుగా మలచుకునేందుకు బీసీల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలిచ్చి ప్రభుత్వమే భవన నిర్మాణాలకు పూనుకున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలా బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించలేదు.
బీసీ కులాలు నిలదొక్కుకునే పథకాలు: బీసీ కులా లు నిలదొక్కుకునేందుకు ఆసరాగా బర్లు, గొర్ల పంపిణీ, గీత, చేనేత, మత్స్యకార్మికులకు ప్రమాద బీమా, కల్లు దుకాణాల పునరుద్ధరణ, నేతన్నకు చేయూత, సెలూన్లకు ఉచిత విద్యుత్తు, ఆధునిక లాం డ్రీలు, ధోబీఘాట్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్నీ బీసీ కులాలకు ఆసరా అయ్యాయి. మాంసం, మత్స్య, పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.ఇట్లా అనేకానేక పథకాలు బీసీలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపయోగపడ్డాయి.తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోయింది. దాన్నెవ్వరూ కాదనలేరు. గత పదేండ్లలో జరిగిన అభివృద్ధిని మరిచిపోయి పునర్నిర్మాణానికి గంతలు కట్టి ఏదైనా మాట్లాడుతామంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు.
-జూలూరు గౌరీశంకర్