భూత్పూర్, డిసెంబర్ 21 : అర్హులందరికీ డబుల్ బె డ్రూం ఇండ్లను అందజేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని సిద్దాయపల్లిలో నిర్మించిన 288 డబుల్ ఇండ్లకు లక్కీడీప్ తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మండలంలోని జర్నలిస్టులు అందరికీ ఇండ్లను కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని మద్దిగట్లలో 80, కొత్తూర్లో 40, భూత్పూర్ మున్సిపాలిటీలో 180 ఇండ్ల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సొంత స్థలాలు ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో రెండు పడకల గదులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, విండో చైర్మన్ అశోక్రెడ్డి, వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, కౌన్సిలర్లు బాలకోటి, శ్రీనివాస్రెడ్డి, రామృష్ణ, కోఆప్షన్లు అజీజ్, ముడా డైరెక్టర్లు సాయిలు, చంద్రశేఖర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, నర్సింహులు, రాములు పాల్గొన్నారు.