కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉన్నది. ఆ పార్టీకి ఇప్పుడు దేశంలో ఎక్కడా పతార లేదు. ఆ పార్టీ ఏనాడో తొవ్వ తప్పిన నావికుడు లేని నావ. అయితే కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్రతో తన పాప ప్రక్షాళనకు ‘నడక-నడత’ నేర్చుకునే పనిలో ఉన్నదిప్పుడు. అయినా యాళ్లకు ఆ పార్టీ యువరాజు రాహుల్గాంధీ ఏ విదేశీ, విహారయాత్రకు వెళ్తాడో తెలియని పరిస్థితి!
ఇక.. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలు, విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ బీజేపీ. పెద్దనోట్ల ఉప సంహరణ సమయంలో ‘అవినీతి అంతం కోసమే..’ అని చెప్పి మన చెవుల్లో పూలు పెట్టింది. జీఎస్టీ రుద్ది, కరోనా విలయంలో కనికరం లేకుండా వ్యవహరించిన పార్టీ బీజేపీ. రైతు మనుగడకే ప్రశ్నార్థకమైన వ్యవసాయ నల్లచట్టాలను వెనక్కితీసుకొని సరిపెట్టుకున్న సుకుమార ప్రధా ని మోదీ తీరుతెన్నులు దేశ ప్రజల మనసులను ఎంతో గాయపరిచాయి. ఇది మన కళ్లెదుటి వాస్తవం. నిత్యావసర, అత్యవసర వస్తు సామాగ్రి ధరల విజృంభనకు మూలం చమురు ధరలు. ఆ ధరలకు అమానవీయంగా గేట్లు ఎత్తిన చరిత్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానిది. ప్రధానిగా మోదీ ఏం వెలగబెట్టాడయ్యా అని ఎవరినడిగినా సామాన్య పౌరులపై మోయలేని భారం మోపాడని చెప్తారు. ఓ దిక్కు ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార బీజేపీ పార్టీ, మరో దిక్కు చేసిన పాపాలతో అంతులేని ఉసురు, పుట్టెడు దారిద్య్రంలో మునిగిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు పార్టీల కన్ను ఇప్పుడు పచ్చగా అలరారుతున్న తెలంగాణపై పడింది. తెలంగాణపై ఎన్నడూ లేనంత ప్రేమను చూపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కావలనే ఆకలితో అలమటిస్తున్నాయి.
మన భాష, మన యాస, మనోభావాలు, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధి వంటివి ఏమాత్రం తెలియని ఈ ఢిల్లీ పార్టీలకు, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాలు రాసిచ్చిందే, చెప్పిందే వేదం అవుతున్నది. వాస్తవాలకు భిన్నంగా, సత్యదూరమైన ప్రసంగ పాఠాలతో జాతీయ పార్టీలు నాయకులు టైం పాస్ చేయడానికే తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రజలు తెలివిమంతులు కాబట్టే ఆ దిగుమతి నేతల సభలు, సమావేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ పాత ముచ్చటే చెప్పారు. ఇగ నిన్నటి తుక్కుగూడ సభలో అమిత్ షా అబద్ధాల పాట పాడారు. ప్రగల్బాల బీజేపీ అత్యాశకు, అతి విశాసానికి ప్రతీక ఆ సభ మరోసారి నిరూపించింది.
సీఎం కేసీఆర్ ఒక్క వాగ్బాణం సంధించాలే గానీ వేగంలో కాంగ్రెస్, బీజేపీలు పతా లేకుండా కొట్టుకుపోతాయి. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మించి సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. కేసీఆర్ ప్రజానుకూల నిర్ణయాలతో లాభపడనివారు తెలంగాణలో లేరంటే అతిశయోక్తి కాదు. సుసంపన్నమైన, సస్యశ్యాలమైన రాష్ట్రంగా తెలంగాణ కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు. కాబ ట్టే తెలంగాణపై ఢిల్లీ పార్టీల కన్నుపడింది. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ ఉండగా ఆ దివాళా పార్టీలతో తమకు ఎలాం టి అవసరం లేదన్నది తెలంగాణ సగటు పౌరుని మనోగతం. ఇంకా నిజం చెప్పాల్నంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని సుసంపన్నం చేయగల మేధోశక్తి కేసీఆర్కు మాత్రమే ఉన్నదనడంలో సందేహం లేదు. కేసీఆర్ తెలంగాణలోని మెజారిటీ ప్రజల గుండె చప్పుడు!
ఇల్లెందుల దుర్గాప్రసాద్ 94408 50384