భవిష్యత్లో అమెరికా కొత్త సమస్యను ఎదుర్కోక తప్పదేమో?. ఆ సమస్య ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అయితే ఎదుర్కోవడం దానికి కొత్తేం కాదు. కానీ ఈసారి ఎదురయ్యే సమస్య మన ఆంధ్రా సోదరుల నుంచి తలెత్తబోతుండటంతో, ఒకనాటి వారి బాధిత తెలంగాణ వాసులు తస్మాత్ జాగ్రత్త అని అమెరికాను హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏదో తేలక రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోవడంతో ఇప్పుడు ఆంధ్రా రియల్టర్ల కన్ను అమెరికాపై పడినట్టు సమాచారం. అమెరికాలో ఆంధ్రులు ఎక్కువగా స్థిరపడిన నగరాల పొలిమేరల్లో వెంచర్లు వేసి అమరావతి ప్రాంత రియల్టర్లు బిజినెస్ చేస్తున్నారట. ‘అమరావతి కంటే అమెరికా బెటర్’ అంటూ కరపత్రాలు ముద్రించి మరీ ప్లాట్ల బిజినెస్ చేస్తున్నారట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ… రేపటి రోజున అమెరికా కూడా మా వల్లనే అభివృద్ధి చెందిందని ఆంధ్రా నేతలు అనే ప్రమాదం లేకపోలేదని, తస్మాత్ జాగ్రత్త అంటూ గత అనుభవంతో తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
– వెల్జాల