నేడు జయశంకర్ సార్ వర్ధంతి
ప్రణబ్ ముఖర్జీ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత.. అప్పుడు కేసీఆర్ వచ్చిండు. మిమ్మల్ని గలవాలె సార్, తెలంగాణ గురించి మాట్లాడాలె అని. కేసీఆర్ తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ గదా? నా గురించి తెలుసుకున్న తర్వాత, విన్న తర్వాత… మీ గురించి కాన్స్టెంట్గ వింటున్నం. చాలా మంది చెప్పిండ్రు. మిమ్మల్ని గలుసుకోవచ్చా అంటే… ఒక రోజు గలిసినం. ఫస్ట్ డే నే దాదాపు డే అంతా గూర్చున్నం.
ఆయన అడుగుడు, నేను జెప్పుడు! నేను ఇంప్రెస్ అయ్యింది ఏందంటే.. ఆయన లోతుకు బోయి అడిగేది. మిగతా వాల్లు ఎవరైన లోతుకు బోయేవాల్లు గాదు. విశ్లేషించి, దాన్ని ఇట్ల ఎందుకు గాదు, అట్ల ఎందుకు గాదు, మనం జెప్పిందే వినడం గాదు, క్రిటికల్గ చర్చించేటోడు. అది నేను చాల ఇంప్రెస్ అయిన. ఎందుకంటే మనిషికి విషయ అవగాహన వుంటే గనుక ఆ క్వశ్చన్స్ వస్తయ్. లేకపోతే రావు. పోతే… జూస్తుంటే ఆయన భాష.. ఆయన తెలంగాణ ప్రజల భాషలో చెప్పేటటువంటి ఆ లక్షణాలు కనబడ్డయ్ నాకు. విషయ అవగాహన వుండి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల భాషలో నుడికారంలో తీసుకుపోయేటటువంటి వ్యక్తిని మొదటి సారి జూసిన నేను. నా 50, 60 ఏండ్ల అనుభవంలో నన్ను ఇంప్రెస్ జేసింది అదే.
సమస్యను అర్థం చేసుకొని ప్రజల నుడికారంలో, ప్రజల భాషతో ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి.. ఏకైక నాయకుడు నా దృష్టిలో కేసీఆర్.
తెలంగాణను తప్పకుండ జూస్త. నా కైతే ఏం సందేహం లేదు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం అనే ది మేజర్ ఎజెండా. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి మోడల్ ఎట్ల వుండాలె అన్నప్పుడు… అగ్రికల్చర్ ఎట్ల ఉండాలె, ఇరిగేషన్ ఎట్ల వుండాలె అనే ప్రణాళిక ఉంది. తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం ఎట్ల వుండాలె అంటే.. అగ్రికల్చర్ లెవల్లో, ఇరిగేషన్, రూరల్ డెవలప్మెంట్ లో… అట్ల అన్ని వస్తయ్. విద్యావిధానం ఎట్లా వుండాలె, వైద్య విధానం ఎట్ల వుండాలె? అన్నీ సాధ్యమైతయ్.
(‘వొడువని ముచ్చట’ పుస్తకం నుంచి…)