ఒక దేశంలో రాజ్యాధికారం, మతపరమైన అధికారాలు ఎప్పుడైతే ఒక్కటవుతాయో.. అప్పుడు ఆ దేశంలో హింసాత్మక పరిణామాలు చోటుచేసుకుంటాయని చరిత్ర చెప్తున్న సత్యం. నేడు మన దేశంలో జరుగుతున్నదదే. ‘వ్యవస్థీకృత మతం’ స్వార్థం కోసం ఒక సంస్థగా మారింది. మతం, రాజకీయ ఎజెండాలు ఒకదానికొకటి దన్నుగా నిలువడమే దీనికి కారణం. మతం రాజకీయంతో సహజీవన బంధాన్ని కలిగి ఉన్నప్పుడు రాజకీయం నియంతృత్వంగా మారుతుంది. మతం ఉన్మాదంగా రూపుదాలుస్తుంది.
మోదీ హయాంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలన్నీ కాలం చెల్లినవిగా చెప్పబడుతున్నాయి. అలాగే అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న రక్షణ చట్టాలన్నింటినీ మోదీ ప్రభుత్వం చట్ట సవరణల పేరుతో రద్దు చేస్తున్నది. జాతి సంపదను, ప్రభుత్వరంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ దేశభక్తిగా చెప్పుకొంటున్నది. ప్రశ్నించినవారిని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నది.
వ్యవస్థీకృత మత రాజకీయాలు వ్యక్తుల భావో ద్వేగాలను రెచ్చగొడతాయి. తద్వారా వ్యక్తు ల్లో నీచ ప్రవృత్తులకు బీజం వేస్తాయి. మత రాజకీయం ఎన్నికల ప్రయోజనం కోసం ప్రజల్లో విభజన రేఖలు గీసి లబ్ధి పొందజూస్తుంది. అదే సమ యంలో ఒక నిర్దిష్ట మత సమూహాన్ని, కులం తదితర రేఖలకు అతీతంగా ఐక్యపరిచి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిం చుకుంటుంది. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సమ స్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం ద్వారా తమను ప్రశ్నించే పరిస్థితులు లేకుండా చూసుకోవటం ఈ రాజ కీయాల లక్ష్యం. అదే సమయంలో పాలనపరమైన సమర్థత, సమస్యల పరిష్కారం ఆధారంగా ప్రజల అభిమానాన్ని సంపాదించి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా.. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావటం, అధికారాన్ని నిలబెట్టుకోవటం అనే దగ్గరి దారి ఈ మతరాజకీయాల మరో లక్ష్యం.
దేశంలో 1947కు ముందు కూడా వ్యవస్థీకృత మెజారిటీవాదం అంతర్గతంగా సూక్ష్మంగానైనా కొనసాగింది. 1948 జనవరిలో గాంధీ హత్యకు గురైనప్పుడు ఈ శక్తులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది. ప్రజల్లో హింసను ప్రోత్సహించి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిందన్న కారణంతో నిషేధించా రు.1948, ఫిబ్రవరి లో విధించిన నిషేధం 1949 జూలై లో తొలగిపోయింది.
1951 అక్టోబర్లో ఏర్పాటైన భారతీయ జన్సంఘ్ హిందూ హక్కుల సాధనను లక్ష్యంగా చెప్పుకొన్నా, పెద్ద గా ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. ఆ తర్వాతి కాలంలో జనసంఘ్ 1980 ఏప్రిల్లో బీజేపీగా రూపాంతరం చెందింది. 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ హత్య తర్వాత, లోక్సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం ఇద్దరు పార్లమెంటు సభ్యులకే పరిమితమైంది. 1990 సెప్టెంబర్లో అయోధ్య పేరుతో బీజేపీ అధినాయకుడు రథయాత్ర ప్రారంభించారు. దీంతోనే దేశంలో మెజారిటీ వాదానికి బీజాలు పడ్డాయి. రాజకీయాలు, మతం మధ్య అపవిత్ర పొత్తుకు విత్తనాలు పడ్డాయి. ఇదే బీజేపీకి జవ సత్వాలు నింపింది.
నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రావడంతో మత రాజకీయం వికటాట్టహాసం చేస్తున్నది. అనేక రూపాల్లో మెజారిటీవాద బెదిరింపులు, మూకదాడులు ఎక్కువయ్యాయి. దోషులు బాహాటంగా తిరుగుతున్నా చర్యలు తీసుకునేందుకు పోలీసులు ముందుకురాని దుస్థితి. ఇదిలా ఉంటే.. బాధితులపైనే కేసులు పెట్టారు. ఏబీవీపీ, భజరంగ్దళ్ లాంటి హిందూత్వ సేనలు తమ రెచ్చగొట్టే, చట్టవిరుద్ధమైన చర్యలకు ప్రభుత్వ రక్షణ పొం దాయి. మైనారిటీ వర్గాలపై దాడులు, బహిరంగ హింసాత్మక చర్యల దాకా విశృంఖలంగా చెలరేగిపోయారు. ఇదిలా ఉంటే.., బీజేపీ నాయకత్వం కూడా తమ మాట లు, చేతల ద్వారా ఒక వర్గం లక్ష్యంగా రెచ్చగొట్టే చర్యలకే పాల్పడింది.
తన మెజారిటీవాద ప్రచారంతో విజ యం సాధించిన మోదీ, వ్యూహాత్మకం గానే విధేయతతో కూడిన బ్యూరోక్రాట్లను పాలనారంగంలోని కీలక స్థానాల్లో నింపారు. రాజ్యాంగ కీలక పదవులన్నీ తమలాంటి భావాలు కలిగి, తమ ఎజెండాకు కట్టుబడి ఉన్నవారికి కేటాయించా రు. తద్వారా విభజన ఎజెండాను ముం దుకు తీసుకువెళ్తున్నారు. హిందుత్వ ఎజెండా నెమ్మదిగానే అయినా.. తమదైన లక్ష్యానికి అను గుణంగా కచ్చితంగా సాకారం చేసుకుంటు న్నది. ఈ నేపథ్యంలోంచే తమ రాజకీయ ప్రాధాన్యాలను ప్రతిబింబిస్తూ పాఠ్యపుస్తకాలు కూడా మారుస్తున్నారు. చరిత్ర పాఠ్యాంశాలను తిరగరాస్తున్నారు.
భావప్రకటనా స్వేచ్ఛ దేశ ఐక్యతను దెబ్బతీసేదిగా పరి ణమిస్తున్నది. ప్రశ్నలడగడం, సమాధానాల కోసం శాంతియుతంగా నిరసనలు జరపడం దేశ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణిస్తారు. మతం రాజ్యంతో కలెగలిసి పోవ డం వల్ల కొద్దిమంది చేతుల్లో అధికార కేంద్రీకరణ జరుగుతుంది. ఎందుకంటే వారు మెజారిటీ సమూహం సమ్మతి పేరుతో అన్నింటినీ వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తారు. రాజ్యాధికారం, జాతి సంపద కొద్దిమంది దగ్గరే కేంద్రీకృతమైన ప్పుడు, అనుభవిస్తున్నప్పుడు, నిరంకుశ నిర్మాణాల ఆవిర్భావాన్ని మనం చూస్తాం.
మోదీ హయాంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలన్నీ కాలం చెల్లినవిగా చెప్పబడుతున్నాయి. అలాగే అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న రక్షణ చట్టాలన్నింటినీ మోదీ ప్రభుత్వం చట్ట సవరణల పేరుతో రద్దు చేస్తున్నది. జాతి సంపదను, ప్రభుత్వరంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ దేశభక్తిగా చెప్పుకొంటున్నది. ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ఏకమై ఐక్యంగా నిలిచి పోరాడకపోతే పెనుముప్పు పొంచి ఉండే అవకా శం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి)
పువ్వాడ అజయ్కుమార్