నాయకుడు ఎప్పుడైనా దారిచూపాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో వినూత్న పథకాలతో దేశానికే దారిచూపారు. మిగతావారు అనుకరిస్తారు. వరంగల్ సభలో కాంగ్రెస్ చేసిందదే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందీ అదే. కేంద్రం ప్రవేశపెట్టిన ‘హర్ ఘర్ జల్’ ‘మిషన్ భగీరథ’కు కాపీ. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’.. ‘రైతు బంధు’కు నకలు. మరెన్నో పథకాలను కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత వాటి ఆదర్శంగా పథకాలను వివిధ పేర్లతో అమలు చేస్తున్న రాష్ర్టాలు చాలానే ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు రూపొందించవచ్చు. వాటికి తెలంగాణ పథకాలే ఆదర్శం కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోంచే తెలంగాణ తరహా పథకాలను దేశం, పలు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా వరంగల్లో నిర్వహించిన రైతు సంఘర్షణ యాత్రలో కాంగ్రెస్ నూతన వ్యవసాయ విధానం ప్రకటించింది. దానిపేరు మాత్రమే నూతనం. అందులో ఉన్నవన్నీ పాతవే. పెట్టుబడి సాయమన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయని సాయం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో చేస్తున్నది. ఇది కేసీఆర్ విధానమే తప్ప, కాంగ్రెస్ కొత్తగా తెచ్చే విధానమైతే కాదు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్ట్ పెడతామన్నారు. తెలంగాణలో ఇదీ అమలవుతున్నదే. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కానీ, ఇప్పటిదాకా టీఆర్ఎస్ సర్కారు చేసిందదే. చేస్తున్నదీ అదే. మద్దతు ధర ఇస్తామన్నారు.. రాష్ట్ర ప్రభుత్వమే పంటలు కొని మద్దతు ధరకు లెక్కగట్టి రైతు బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నదిగా. సాగు నీరందిస్తామన్నారు.. కొత్తగా చెప్పేదేముంది!
కాంగ్రెస్ ప్రకటించిన నూతన విధానాలన్నీ.. కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలే. దీంతో ప్రతిపక్షాలకు కొత్త పథకాలు, కొత్త విధానాలు తీసుకొచ్చి, అమలుచేసే విజన్ లేదని తేటతెల్లమవుతున్నది. ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ తెచ్చిన పథకాలనే మళ్లీ చెప్తున్నాయంటే.. ఆయన విజన్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అంతటి ముందుచూపు, విజన్ ఉన్న కేసీఆర్ ఉంటే.. రాష్ర్టానికైనా దేశానికైనా.. ఇంతకన్నా ఇంకేం కావాలి.
శ్రావణ్కుమార్ ,బొమ్మకంటి
95812 91919