అదానీ కంపెనీ షేర్లను వారు సృష్టించిన డొల్ల కంపెనీలే కొన్నాయి. షేర్ల విలువను కృత్రిమంగా పెంచాయి. ఇప్పుడు వాటి విలువ పడిపోవడంతో నష్టపోయింది కూడా ఆ కంపెనీయే గనుక. దీంతో జనానికేమి నష్టమని కొందరంటున్నారు. కానీ, అదానీ షేర్ల విలువ పడిపోవడం వెనుక, అతని కంపెనీ ఆస్తులు పెరగడం వెనుక పరోక్షంగా ప్రజాధనం ఏ విధంగా నష్టపోయిందనేదే ఇందులో అసలు కిటుకు.
ప్రస్తుతం జరుగుతున్న మోదీ-అదానీ వ్యవహారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలింది. ఇప్పుడు కేంద్రం తూతూ మంత్రంగా విచారణ జరిపించి ప్రజలను మభ్యపెట్టే అవకాశం లేకపోలేదు. ఆ మాయలో దేశ ప్రజలు చిక్కుకోవచ్చు కూడా. కానీ విదేశీ మదుపరులు ఎందుకు నమ్ముతారు, వారెందుకు మోసపోతారు?
అదానీ కుటుంబం మొదట వజ్రాల వ్యాపారం చేసింది. ముడి వజ్రాలను మొదట అదానీ కుటుంబం ఏ ఆఫ్రికా నుంచో దిగుమతి చేసుకున్నది. వాటిని వజ్రాభరణాలుగా మార్చి ఎగుమతి చేసింది. ఎగమతుల ప్రోత్సాహకానికి ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చింది. ఆ రాయితీలను పొందాలంటే సరైన ఆధా రాలను చూపించాలి. కానీ, అదానీ కుటుంబం దిగుమతులు, ఎగమతులు జరిగినట్టుగా నకిలీ కాగితాలను సృష్టించింది. అదానీ వ్యాపారం అక్కడి నుం చి ప్రారంభమైంది. మొదటి రాయితీగా అదానీ కుటుంబం రూ.680 కోట్లు కొట్టేసింది. నయా పైసా పెట్టుబడి లేకుండానే అదానీ వ్యాపారం ఇలా షురువైందన్నమాట. వాస్తవమేమంటే వజ్రాల దిగుమతి, ఎగుమతి అనేది ఒక భ్రమ. ఇలా ప్రభుత్వ రాయితీలు పొందడం కోసమే డొల్ల కంపెనీలు కోకొల్లలుగా అదానీ కుటుంబం సృష్టించింది.
అదానీ డొల్ల కంపెనీలు పొందిన ప్రభుత్వ రాయితీ సొమ్ము ఎవరిదో కాదు, ప్రజలు చెల్లించిన పన్నులే. అదానీ కుంభకోణానికి సహకరించిన వారు కేతన్ పరేఖ్ లాంటి ఆరితేరిన ఆర్థికనేరగాళ్లు. ఆర్థిక నేరాలు చేసి ఎన్ఫోర్స్మెంట్కు దొరకని, పరారీలో ఉన్న నిందితులంతా అదానీకి భాగస్వాములు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాని కుమారుడికి అదానీ తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. వీరి ప్రత్యేకత ఏమంటే…
ఓవర్ ఇన్వాయిసింగ్… ఉదాహరణకు అదానీ సోలార్ పవర్ ధర. వారు కొనుగోలు చేసిన మెషినరీ ఖరీదు, ఉత్పత్తి వ్యయాన్ని జోడించి లాభసాటిగా విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముతారు. ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్ ధరను నిర్ధారించడానికి రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. ఇందులో మోసం ఎక్కడుందంటే, అంతర్జాతీయ మార్కెట్లో వారు కొనుగోలు చేసిన సోలార్ ఎక్విప్మెంట్ వంద కోట్లు ఉందనుకుందాం. దాన్ని ఒక కంపెనీ రెండు వందల కోట్లకు కొంటుంది. మరో కంపెనీ దీన్నే రెండు వందల కోట్లకు కొంటుంది. దాన్నీ కొనుగోలు చేసిన మరో కంపెనీ దాన్ని 800 కోట్లకు అమ్ముతుంది. అదానీ ఆ 800 కోట్ల ఎక్విప్మెంట్ వ్యయానికి ఉత్పత్తి వ్యయాన్ని జోడించి సోలార్ విద్యుత్కు ధర నిర్ణ యించి ప్రభుత్వానికి అమ్ముతారు. దీన్నే ఓవర్ ఇన్వాయిసింగ్ అంటారు. ఆ రకంగా బొగ్గును ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే మన జెన్కో లాంటి కంపెనీకి అదానీ అమ్ముతాడు. ఈ జెన్కో కంపెనీలు కనీసం 10 శాతం అదానీ బొగ్గును కొనాలనేది కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన. అక్కడ రూపాయికి కొన్న దాన్ని ఇక్కడ మన జెన్కోకు రూ.10కి అమ్ముతారు. ఆ మొత్తాన్ని విద్యుత్ వినియోగదారులు చెల్లించాలి.
ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో మన దేశం కూడా ఒక భాగం. మనకూ విదేశీ పెట్టుబడులు వస్తుంటాయి, ఇతర దేశాల్లో మనమూ పెట్టుబడులు పెడుతాం. అదానీకి 30 దేశాల్లోవ్యాపారాలు, పెట్టుబడుల లావాదేవీలున్నాయి. మన దేశంలో అయితే అదానీని కాయడానికి మోదీ ఉన్నాడు. మరి ప్రపంచం మొత్తమ్మీద అదానీని కాయడానికి ఎవరుంటారు?. నిబంధనలకు విరుద్ధంగా అదానీ ఉంటే ఐఎంఎఫ్నో, వరల్డ్ బ్యాంకో కాయడానికి సిద్ధంగా ఉండదు కదా?
ఇక్కడ అదానీ ఆస్తులు పెరగడం, తగ్గడం ముఖ్యం కాదు. అండర్ ఇన్వాయిసింగ్, ఓవర్ ఇన్వాయిసింగ్ల ద్వారా జరిగే మోసం ముఖ్యమైనది. ప్రభుత్వం అదానీకి చదరపు మీటరుకు రూపాయి చొప్పున భూమి అమ్మితే, దాన్నే అక్కడే ఇంకొకరికి రూ.14 చొప్పున లీజుకు ఇస్తాడు. అలా ప్రభుత్వం నుంచి తీసుకున్న అడవులను ధ్వంసం చేసి పర్యావరణానికి విఘాతం కలిగిస్తారు. ఈ విధ్వంసాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదనేది అసలు ప్రశ్న. పర్యావరణానికి అదానీ కంపెనీ కలిగించిన నష్టానికి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం రూ.200 కోట్ల జరిమానా విధించింది కూడా. కానీ మోదీ ప్రభుత్వం ఆ జరిమానాను రద్దుచేసింది. ఇలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదానీకి పలురకాలుగా లబ్ధి చేకూరుస్తూనే వచ్చింది.
ఇక స్టాక్ మార్కెట్, స్టాక్ మ్యానిప్లేషన్ విషయానికి వద్దాం. ఇందులో జరిగే నష్టం ఏమంటే… వారి కంపెనీల వాటాలను వారే పెంచి, పెరిగిన వాటాలను వారే కొనుగోలు చేస్తారు. పెరిగిన స్టాక్ వల్ల ఎవరికి నష్టం లేదు కానీ, కృత్రిమంగా పెంచిన స్టాక్లను బ్యాంక్లు, ఫైనాన్స్ కంపెనీలకు పూచీగా చూపించి బాండ్స్ అమ్మడం. బాండ్స్ అమ్మడమంటే ఏమిటి? అప్పు తీసుకోవడం. బాండ్స్ అమ్మడానికి బ్యాకప్ ఏమిటీ షేర్స్. మరి షేర్ వ్యాల్యూనే పడిపోతే? మరి బాండ్స్ కొన్నవాళ్ల పరిస్థితి ఏమిటి? వీటిని కొన్నవాళ్లలో 34 శాతం బ్యాంకులు, బీమా కంపెనీలే ఉన్నాయి. ఇంకో 34 శాతం ఫారెన్ ఇన్వెస్టర్లది. ప్రైవేట్ వ్యక్తులు కొన్నది చాలా తక్కువ శాతం. ఇందులో హోల్సేల్గా జరిగిన మోసాలే ఎక్కువ. దీంట్లో విదేశీ మదుపరులకు భారీ గా నష్టం వాటిల్లింది.
అదానీ షేర్లు అసాధారణ రీతిలో ఉన్నపళంగా పెరగడంతో విదేశీ మదుపరులకు అనుమానం వచ్చింది. దీంతో వారు హిండెన్బర్గ్ను రంగంలోకి దింపారు. ఈ సంస్థ షేర్ మార్కెట్లను లోతుగా అధ్య యనం చేస్తూ పెట్టుబడులను పెట్టేవారికి సలహాలు ఇస్తుంది. ఇక్కడ జరిగిందేమంటే పేకాట ఆడటమే తప్పు. అయితే ఆ ఆటలోనూ కొన్ని నిబంధనలు పాటించాలి. పాటించకపోతే.. నిర్వాహకులకు చర్య తీసుకునే అధికారం ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా స్టాక్మార్కెట్ వ్యాపారాల్లోనూ అదానీ నిబంధనలను ఉల్లంఘించాడు. వాటినే హిండెన్బర్గ్ బయటపెట్టింది. స్టాక్ మార్కెట్లో జూదం ఆడే వారందరిని అదానీ మోసం చేస్తున్నాడని, అంతర్జాతీయ సంస్థలను అప్రమత్తం చేస్తూ హిండెన్బర్గ్ తన పరిశోధన నివేదికను బయటపెట్టింది.
ఇది అదానీ వ్యాపార సామ్రాజ్యం. ఇందులో విమానాశ్రయాలున్నాయి, ఓడ రేవులు, రైల్వేలు కూడా ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకోవడం, వాటిద్వారా జరిగే ఎగుమతులు, దిగుమతులపై ఒక కమిషన్ ఎజెంట్గా చార్జీలు వసూలు చేయడం వరకే అదానీ సంస్థ పరిమితం. అందుకే టాటా, బిర్లాల మాదిరిగా అదానీ వద్ద ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉండరు. వేలల్లో మాత్రమే ఉంటారు. దీంతో ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. ఆ మాటకొస్తే ముందు నుంచి బడా పారిశ్రామికవేత్తలుగా ఉన్న టాటా, బిర్లాల కంటే ఎక్కువ సంపదనను స్వల్ప వ్యవధిలో అదానీ కూడబెట్టాడు.
అదానీ చేసే వ్యాపారాల వల్ల ప్రజలకేం నష్టం అన్నది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. తాను లీజుకు తీసుకున్న ఎయిర్ పోర్టులు, పోర్టులలో హాండ్లింగ్ చార్జీలను పెంచితే ఆ భారాన్ని టికెట్లు, చార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తాడు. ఇవేకాకుండా రైల్వే గ్యారేజీలను, ఆహార ఉత్పత్తులను నిలువ చేసే గోదాములను కూడా అదానీ గ్రూప్ లీజుకు తీసుకుంటుంది. ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టకుండా ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులతో నెలకొల్పిన మౌలిక సదుపాయాలను హస్తగతం చేసుకోవడమే అదానీ పని. సంపద, ఉత్పత్తి సృష్టించే పని చేయకుండా కొల్లగొట్టడమే అదానీ సంస్థ ఏకైక లక్ష్యం. దీనికి ప్రభు త్వ ప్రోత్సాహం, అండదండలు ఉంటాయి.
ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో మన దేశం కూడా ఒక భాగం. మనకూ విదేశీ పెట్టుబడులు వస్తుంటాయి, ఇతర దేశాల్లో మనమూ పెట్టుబడులు పెడుతాం. అదానీకి 30 దేశాల్లో వ్యాపారాలు, పెట్టుబడుల లావాదేవీలున్నాయి. మన దేశంలో అయితే అదానీని కాయడానికి మోదీ ఉన్నాడు. మరి ప్రపంచం మొత్తమ్మీద అదానీని కాయడానికి ఎవరుంటారు?. నిబంధనలకు విరుద్ధంగా అదానీ ఉంటే ఐఎంఎఫ్నో, వరల్డ్ బ్యాంకో కాయడానికి సిద్ధంగా ఉండదు కదా? భారత ప్రభుత్వం ప్రపంచ మదుపరులకు విశ్వాసం కలిగించలేని పక్షంలో భారతదేశానికి విదేశీ పెట్టుబడుల రాక తగ్గే ప్రమాదం ఉన్నది. తత్ఫలితంగా విదేశీ మారకద్రవ్యం, ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయి. భారత ప్రభుత్వానికి అదానీ విశ్వాసం ఉంటే సరిపోదు, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల విశ్వాసం కూడా అవసరం. అప్పుడే ప్రపంచ మదుపరుల విశ్వాసాన్ని పొందగలుగుతాం.
ఇక స్టాక్ మార్కెట్, స్టాక్ మ్యానిప్లేషన్ విషయానికి వద్దాం. ఇందులో జరిగే నష్టం ఏమంటే… వారి కంపెనీల వాటాలను వారే పెంచి, పెరిగిన వాటాలను వారే కొనుగోలు చేస్తారు. పెరిగిన స్టాక్ వల్ల ఎవరికి నష్టం లేదు కానీ, కృత్రిమంగా పెంచిన స్టాక్లను బ్యాంక్లు, ఫైనాన్స్ కంపెనీలకు పూచీగా చూపించి బాండ్స్ అమ్మడం. బాండ్స్ అమ్మడమంటే ఏమిటి? అప్పు తీసుకోవడం. బాండ్స్ అమ్మడానికి బ్యాకప్ ఏమిటీ షేర్స్. మరి షేర్ వ్యాల్యూనే పడిపోతే? మరి బాండ్స్ కొన్నవాళ్ల పరిస్థితి ఏమిటి?
తాజాగా అదానీ వ్యవహారంతో కోల్పోయిన ప్రపంచ మదుపరుల విశ్వాసం పొందాలంటే ఆ దిశగా భారత ప్రభుత్వం నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే దేశానికి నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. మొత్తంగా ప్రభుత్వానికి అదానీ వ్యవహారం గుదిబండలా తయారైంది. అందుకే మోదీ ప్రభుత్వం లోన భయపడుతున్నా, బయటికి మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. అందుకే, అదానీ వజ్రాల వ్యాపారం మొదలుకొని స్టాక్మార్కెట్ దాకా జరుగుతున్న మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. వారిని చైతన్యపరచాలి. హిండెన్బర్గ్ అదే చేసింది. అదానీ వ్యవహారం మొత్తం బయటపెట్టేసరికి రాజుగారి దేవతావస్ర్తాల వలె దేశం ఒక్కసారిగా భగ్గుమన్నది. ఇందులో అసలు దేశంలో ఏం జరుగుతుం దనే విషయమై ప్రజలు నిజాలను నిగ్గు తేల్చుకోవా ల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ పాత్రికేయుడు)
ఎంవీఎస్ శర్మ
94900 99222