సిడ్నీ: అంతరిక్షంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందుకే సైంటిస్టులకు రోదసి అంటే విపరీతమైన ఆసక్తి. తాజాగా అంతరిక్షంలో కొన్ని సిగ్నల్స్ను వ్యోమగాములు కనుగొన్నారు. ఇవి మన పాలపుంత మధ్య భాగం నుంచి వచ్చినట్లు సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఈ రేడియో తరంగాలు మానవులు ఇప్పటి వరకూ చూసిన ఏ విధానాన్ని అనుసరించడం లేదని తెలుస్తోంది.
ఏదైనా మనకు తెలియని అంతరిక్ష పదార్థం నుంచి ఇవి ఉత్పత్తి అయ్యాయా? అని సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ వెల్లడించింది. ‘‘ఈ తరంగాల్లో ఉన్న ఒక ముఖ్యమైన భేదం ఏంటంటే.. వీటిలో పోలరైజేషన్ చాలా ఎక్కువగా ఉంది’’ అని వర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు.