న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో భౌతిక దూరం పాటించడం అనివార్యం కావడంతో వెయిటర్స్గా రోబోలను ప్రవేశపెడుతూ నోయిడాలో ఓ రెస్టారెంట్ వెలిసింది. నోయిడాలోని సెక్టార్ 104లో యల్లో హౌస్ పేరుతో రోబో రెస్టారెంట్ను లాంఛ్ చేయడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రోబోటిక్ వెయిటర్స్తో తొలి రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది.
జైపూర్లో మూడు రెస్టారెంట్లను విజయవంతంగా నిర్వహించిన మల్టీక్యూజిన్ రెస్టారెంట్ చైన్ నోయిడాకు విస్తరించింది. రెస్టారెంట్లో రెండు రోబోలు ఫుడ్ సర్వ్ చేస్తూ టేబుల్స్ దగ్గర సేవలు అందిస్తాయి. ఈ రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తాయని రెస్టారెంట్ యజమాని జిషు ఆనంద్ తెలిపారు.
ప్రతి టేబుల్ నుంచి డేటాను రోబోల్లో ఫీడ్ చేస్తారు. టేబుల్ నెంబర్ను ఫోన్ లేదా ట్యాబ్లెట్లో ఎంటర్ చేయగానే రోబోలు ఆయా టేబుల్స్ వద్దకు వెళ్లి ఆహారాన్ని అందిస్తాయి. రెండు, మూడు గంటల చార్జింగ్తో రోబోలు రోజంతా సేవలు అందిస్తాయి.