రాంచీ : ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్కు ఒకే వేదికపై తాళి కట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్లోని లోహర్దగ గ్రామంలో వెలుగుచూసింది. చట్ట ప్రకారం ఇద్దరు మహిళలను పెండ్లి చేసుకోవడం తప్పే అయినా తాను వారిద్దరినీ విడిచి ఉండలేనని అతడు చెప్పుకొచ్చాడు. కుసుం లక్రా, స్వాతి కుమారి అనే ఇద్దరు మహిళలు సందీప్ ఓరాన్ను ప్రేమించారు.
అతడిని వదులుకోలేక గ్రామంలోని ఒకే మండపంలో సందీప్ను ఇద్దరూ మనువాడారు. మూడేండ్లుగా సందీప్, కుసుం సన్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ క్రమంలో సందీప్ ఇటుక బట్టీలో పనిచేసేందుకు బెంగాల్కు వెళ్లగా అదే బట్టీలో పనిచేసే స్వాతి కుమారికి దగ్గరయ్యాడు.
వారు తమ గ్రామాలకు తిరిగి వచ్చిన తర్వాత కూడా తరచూ కలుసుకునే వారు. ఇరు కుటుంబాల్లో వారి సంబంధంపై గొడవలు చెలరేగగా విషయం పంచాయితీకి చేరింది. సందీప్ ఇద్దరు మహిళలను పెండ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు తీర్మానించడంతో మహిళలు ఇద్దరూ ఇష్టపడటంతో ముగ్గురు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.