వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వారిని అక్కడి నుంచి స్వదేశం తీసుకొచ్చేందుకు భారత్ వివిధ ఆపరేషన్లు చేపట్టింది. కోవిడ్ సంక్షోభం నుంచి ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కావేరీ వరకు.. అనేక సందర్భాల్లో విద్యార్థులను, అక్కడి స్థిరపడిన వారిని తీసుకొచ్చేందుకు భారత సైన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని ఆపరేషన్లను చూసినట్లైతే..
ఆపరేషన్ కావేరీ: ఇటీవల సూడాన్లో ప్రభుత్వం, పారామిలిటరీ దళాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. దీంతో సూడాన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా తయారయ్యాయి. అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ కావేరీ చేపట్టారు. ఈ ఆపరేషన్లో మొత్తం 3,862 మందిని తీసుకొచ్చారు.
ఆపరేషన్ కువైట్.. గిన్నిస్ రికార్డు: ఇరాన్ సైనికులు కువైట్పై దాడి చేసినపుడు దాదాపు 1.5౦ లక్షల మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని భారత్ తీసుకొచ్చేందుకు ఆపరేషన్ కువైట్ చేపట్టారు. రెండు నెలలపాటు సాగిన ఈ ఆపరేషన్లో 500 ఎయిరిండియా విమానాల్లో భారత్ తీసుకొచ్చారు.
ఆపరేషన్ సుకూన్: ఈ ఆపరేషన్ను భారత నౌకాదళం చేపట్టింది. 2006లో లెబనాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినపుడు అక్కడున్న 2,300 మంది భారతీయులతో పాటు శ్రీలంక, నేపాల్ వాసులను తీసుకొచ్చారు.
ఆపరేషన్ సేఫ్ హోమ్కమింగ్: 2011లో లిబియాలో అంతర్యుద్ధం ఏర్పడింది. అక్కడున్న వేల మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 15,000 మందిని భారత వాయుసేన భారత్కు తీసుకొచ్చింది.
ఆపరేషన్ సంకట్ మోచన్: దక్షిణ సూడాన్లో 2016లో ఘర్షణలు జరిగాయి. దీంతో దక్షిణ సూడాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సంకట్ మోచన్ ద్వారా భారత వాయుసేన 153 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చింది.
ఆపరేషన్ బ్రస్సెల్స్: 2016 మార్చిలో బ్రస్సెల్స్ ఎయిర్పోర్టుతో పాటు మాల్బీక్ మెట్రో స్టేషన్పై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ బ్రస్సెల్స్ 2016 చేపట్టారు. బెల్జియంలో ఉన్న 242 మంది భారతీయులను జెట్ ఎయిర్వేస్ విమానంలో తీసుకొచ్చారు.
ఆపరేషన్ గంగ:రష్యా ఉక్రెయిన్పై దాడులు చేయడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ గంగ చేపట్టింది. దాదాపు 18వేల మంది విద్యార్థులను దాదాపు 80కిపైగా విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది.
ఆపరేషన్ దేవీశక్తి: 2021లో అమెరికా సైన్యం అప్ఘనిస్థాన్ నుంచి వెళ్లగానే తాలిబన్లు అప్ఘాన్ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ దేవీశక్తి చేపట్టి అక్కడున్న 6,69 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.
వందే భారత్ మిషన్: కరోనా సమయంలో దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ పెట్టాయి. దీంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు వందేభారత్ మిషన్ను చేపట్టింది. దాదాపు 60లక్షల మంది భారతీయులను స్వదేశానికి రప్పించారు.