సోషల్ మీడియా గురించి ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ టక్కున సమాధానం చెబుతారు. ఏబీసీడీలు వస్తాయో రావో తెలియదు కానీ.. స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్, యూట్యూబ్లో వీడియోలు ఓపెన్ చేసి చూడటం మాత్రం నేటి జనరేషన్ పిల్లలకు కొట్టిన పిండే. దానికి కారణం.. వాళ్లు స్మార్ట్ఫోన్కు అడిక్ట్ అవ్వడమే. అసలు.. చిన్నపిల్లలకు చిన్న వయసు నుంచే ఫోన్ను ఇవ్వొచ్చా? వాళ్లు ఆ వయసు నుంచే సోషల్ మీడియాను వాడొచ్చా? వాడితే ఏమౌతుంది. అసలు.. సోషల్ మీడియా వాడటానికి పిల్లలకు ఒక వయసు ఉంటుందా? ఏ వయసు వచ్చాక పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించే అవకాశం ఇవ్వాలి.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చాలామంది తల్లిదండ్రుల దగ్గర సమాధానం లేదు. వాళ్లకు తెలియదు కూడా. అందుకే.. పిల్లలకు ఏ వయసులో సోషల్ మీడియాను వాడే అవకాశం ఇవ్వాలి.. చిన్న వయసులోనే వాళ్లు సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే ఏమౌతుంది అనే విషయాలపై ఓ క్లారిటీ తీసుకుందాం రండి.
నిజానికి.. సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజర్కు ఖచ్చితంగా 13 ఏళ్ల వయసు ఉండాలి. అంటే.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసిన వాళ్ల లెక్కల ప్రకారం.. పిల్లలకు 13 ఏళ్ల వయసు వస్తే.. వాళ్లు సోషల్ మీడియాను ఉపయోగించే వయసుకు వచ్చేసినట్టేనా. కానీ.. ఎంతమంది పిల్లలు.. 13 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవాళ్లు.. తమ వయసును 13 ఏళ్ల కంటే ఎక్కువగా నమోదు చేసి సోషల్ మీడియాలోకి లాగిన్ అవడం లేదు.
అందుకే.. అసలు తల్లిదండ్రులు పిల్లలకు సోషల్ మీడియాను ఎప్పుడు అలవాటు చేయాలి. వాళ్లు వాడేందుకు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి.. అనేది పిల్లల మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ల మెచ్యూరిటీ లేవల్స్ మీదనే ఆధారపడి ఉంటుంది.
ఒక రీసెర్చ్ ప్రకారం.. 11 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాను అలవాటు చేయకూడదట. ఎందుకంటే.. ఆ వయసు వరకు మెదడులో ఎదుగుదల ఉంటుంది. అటువంటి సమయంలో సోషల్ మీడియా అలవాటు చేస్తే.. వాళ్ల బిహేవియర్లో మార్పులు వస్తాయట. సోషల్ మీడియాను చూస్తూ పిల్లల్లో రకరకాల ప్రవర్తనలు అలవాటు అవుతాయని.. దాని వల్ల.. వాళ్లు ప్రవర్తించే విధానం కూడా మారిపోతుందని సర్వే చెబుతోంది.
తమకు 13 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉందని.. 11 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్నవాళ్లే ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పుడు సమాచారంలో అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని ఉపయోగిస్తున్నారట. మరికొందరు పిల్లలు 10 ఏళ్ల లోపు వారేనంటూ సర్వే తెలిపింది.
13 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు నుంచి సోషల్ మీడియా వాడితే అనర్థాల కంటే కొన్ని లాభాలే ఉన్నాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. దాని వల్ల వాళ్లను సోషలైజ్ అయ్యే విధానం తెలుస్తుందని.. నెట్వర్క్ పెంచుకోగలుగుతారని.. అలాగే కమ్యూనికేషన్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కాకపోతే సోషల్ మీడియాను వాడే సమయాన్ని మాత్రం తగ్గించాలని.. దాని కోసం పిల్లల తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ గమనిస్తూ.. వాళ్లు ఏం చేస్తున్నారో చెక్ చేస్తూ వాళ్లకు తోడుగా ఉంటే సోషల్ మీడియా వల్ల పెద్దగా వచ్చే ప్రమాదం ఏం లేదని అంటున్నారు.