అహ్మదాబాద్ : గుజరాత్లోని వడోదరాలో తొలి ఎయిర్క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని తర్సాలీ బైపాస్లో కొలువుతీరిన ఈ రెస్టారెంట్లో పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, మెక్సికన్, థాయ్ వంటకాలను భోజనప్రియులు ఆస్వాదించవచ్చు. ప్రపంచంలోనే ఎయిర్క్రాఫ్ట్ థీమ్తో రూపొందిన తొమ్మిదవ రెస్టారెంట్ ఇదే కావడం గమనార్హం. ఇక భారత్లో ఓ పాత విమానాన్ని వాడుతూ అభివృద్ధి చేసిన నాలుగో రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్ను నిర్మించేందుకు బెంగళూర్కు చెందిన ఓ కంపెనీ రూ 1.40 కోట్లను వెచ్చించి ఎయిర్బస్ 320ను కొనుగోలు చేసింది.
విమానంలోని ప్రతిభాగాన్ని వడోదరకు తీసుకువచ్చి ఆపై దాన్ని రెస్టారెంట్గా మలిచేందుకు రీమోడల్ చేశారు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ 2 కోట్లు. 102 మంది కస్టమర్లు కూర్చునేలా ఈ రెస్టారెంట్ను తీర్చిదిద్దారు. ఎయిర్క్రాప్ట్ రెస్టారెంట్లో అడుగుపెట్టగానే సందర్శకులకు ఇది నిజమైన విమానం అనిపించేలా ఉంటుంది. వెయిటర్లు, సర్వర్లు ఎయిర్హోస్ట్రెస్లు, స్టివార్డ్స్ను మరిపించేలా డ్రెస్ కోడ్ను పాటిస్తారు.