ప్రవాస భారతీయురాలైన డాక్టర్ పర్విందర్ కౌర్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి జన్యు పరిశోధనలు, జీవ వైవిధ్యం గురించి సూచనలిచ్చే అత్యున్నత సలహా మండలిలో సభ్యురాలైంది. పంజాబ్లోని నవన్షహర్ తన స్వస్థలం. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బయోటెక్నాలజీ సైంటిస్ట్గా పనిచేస్తున్నది. జంతుజాతులు, పంట మొక్కల జన్యుక్రమాన్ని ఆవిష్కరించడంలో పర్విందర్ దిట్ట. అంతరించి పోతున్న జీవుల జన్యుక్రమాన్ని విశ్లేషించి పేరు తెచ్చుకున్నది.
బయోటెక్నాలజీ, వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన 50కి పైగా పరిశోధనా వ్యాసాలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితం అయ్యాయి. ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి ‘సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్’ అందుకున్నది పర్విందర్. బాలికల కోసం పనిచేసే ‘గర్ల్స్ ఎక్స్ టెక్’ సంస్థకు అంతర్జాతీయ అంబాసిడర్గానూ పని చేస్తున్నది. ‘గెలిచే వరకు వెనకడుగు వేయొద్దు. ప్రతి ఓటమి నుంచీ పాఠం నేర్చుకోగలిగితేనే.. జీవితం కొత్తదారిలో పయనిస్తుంది’ అంటుంది పర్విందర్.