Books Banned in India | పుస్తకాలు సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఓ గొప్ప వ్యక్తి అన్నారు. ఎందుకంటే.. పుస్తకాలు చదివితే కామన్ సెన్స్ పెరుగుతుంది. స్కిల్స్ డెలవప్ అవుతాయి. తెలివి పెరుగుతుంది. విజ్ఞానం పెరుగుతుంది. అందుకే.. పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటు అని అంటుంటారు. మీకో విషయం తెలుసా? జీవితంలో పైకి ఎదిగిన వాళ్లు.. ఉన్నత స్థానాలకు చేరుకున్న వాళ్లు.. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వాళ్లంతా వందల వేల పుస్తకాలు చదివినవాళ్లే. తమ జీవిత చరమాంకం వరకు కూడా పుస్తకాలను వదలరు. అందుకే.. పుస్తకాలు చదవడం అనేది గొప్ప అలవాటు అంటారు.
అయితే.. ఇప్పుడు మీకు కొన్ని పుస్తకాల గురించి చెప్పాలి. ఈ పుస్తకాలను మీ జీవితంలో ఒక్కసారైనా చదవాలి. ఏ పుస్తకం చదివినా.. చదవకపోయినా.. ఈ పుస్తకాలను మాత్రం ప్రతి ఒక్కరు చదవాలి. ఇంతకీ ఆ పుస్తకాల్లో ఏముంది? ఏంటా పుస్తకాలు.. అంటారా? అసలు.. ఆ పుస్తకాల్లో ఏముంది అనేది తర్వాత.. ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ పుస్తకాలను ఇండియాలో బ్యాన్ చేశారు. అందుకే.. ఈపుస్తకాలను మీరు ఖచ్చితంగా చదవాలి.
2011లో జర్నలిస్టు జోసెఫ్ లెలీవెల్డ్ ఈ పుస్తకాన్ని రచించారు. ఆయన పులిట్జర్ అవార్డును గెలుచుకున్న జర్నలిస్టు. ఆయన జాతి పిత మహాత్మా గాంధీ జీవితం గురించి ఈ పుస్తకంలో వెల్లడించారు. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు.. జర్మన్కు చెందిన ఆర్కిటెక్ట్ హెర్మాన్ కల్లెన్బాచ్ అనే వ్యక్తితో అఫైర్ ఉండేదంటూ.. ఆ పుస్తకంలో జోసెఫ్ పొందుపరిచారు. అంటే.. గాంధీ స్వలింగ సంపర్కుడు అంటూ ఆ పుస్తకంలో జోసెఫ్ స్పష్టం చేయడంతో ఆ పుస్తకాన్ని ఇండియాలో బ్యాన్ చేశారు.
ఈ పుస్తకాన్ని 1937 లో ఆర్థుర్ మైల్స్ అనే రచయిత రచించాడు. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. వెస్టర్న్ ప్రాంతాలకు చెందిన వారికి.. హిందూమతం గురించి చెప్పడం. అయితే.. హిందూమతం గురించి ఈ పుస్తకంలో రచయిత ఏం రాశారంటే.. హిందూ మతంలో.. లింగాన్ని పూజించడం అనేది చాలా ఒక ఆనవాయితీ.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ లింగం అంటే మనం కొలిచే శివలింగం కాదు. అలాగే.. ఇండియాలో ఉండే హిందూ పూజారులు.. కుల వ్యవస్థను అడ్డం పెట్టుకొని.. సొసైటీని ఎలా డామినేట్ చేస్తున్నారంటూ.. వాళ్లను, హిందూ మతాన్ని విమర్శిస్తూ రాసిన పుస్తకం అది. అందుకే.. దాన్ని ఇండియాలో బ్యాన్ చేశారు.
ఇక.. ఇంకో పుస్తం.. ద సటానిక్ వెర్సెస్. ఈ పుస్తకాన్ని ఫేమస్ రైటర్.. సల్మాన్ రుష్దీ రచించాడు. ఇస్లాం మతం గురించి ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఇస్మాం మతంలో రూల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే.. ఇస్లాం మతం.. అవాస్తవాలను ఎక్కువగా ప్రచారం చేస్తుంది.. అంటూ ఏదేదో రాశాడు. దీంతో ఆ పుస్తకాన్ని రిలీజ్ అయిన 9 రోజుల్లోనే భారత ఫైనాన్స్ మినిస్ట్రీ బ్యాన్ చేసింది.
1926 లో ఈ పుస్తకం రిలీజ్ అయింది. అమెరికాకు చెందిన రీసెర్చర్ కాథెరిన్ మాయో ఈ పుస్తకాన్ని రచించారు. ఆమె భారత్లో పర్యటించిన తన అనుభవాలనే పుస్తకంగా రాశారు. అయితే.. హిందూ మతంలోని కొన్ని ఆచారాలను ఆమె విమర్శిస్తూ.. తప్పు పడుతూ.. తన పుస్తకంలో రాశారు. బాల్య వివాహాలు, దళిత మహిళలపై చిన్నచూపు, ఇలా.. తను భారత్లో పర్యటించినప్పుడు తను ఫేస్ చేసిన విషయాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. కానీ.. హిందూ మతాన్ని తప్పుపడుతూ తను ఈ పుస్తకాన్ని రాయడంతో పాటు హిందూ మతస్తుల మూఢనమ్మకాల వల్లే బ్రిటీషర్లు ఇండియాను ఆక్రమించారు.. అంటూ పేర్కొనడంతో ఆ పుస్తకాన్ని కూడా భారత్లో బ్యాన్ చేశారు.
ది పాలిస్టర్ ప్రిన్స్.. అనే పుస్తకం.. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ బయోగ్రఫీ. అయితే.. అది అనధికారిక బయోగ్రఫీ. ఆ పుస్తకాన్ని ఆస్ట్రేలియాలో రైటర్ రిలీజ్ చేశారు. కానీ.. దానిపై అంబానీ పరువు నష్టం దావా ఫైల్ చేయడంతో.. ఆ బుక్ను అంతటా బ్యాన్ చేశారు.
ఈ పుస్తకాన్ని ప్రియాంకా పతక్ రచించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బాబా రామ్దేవ్… ఒక్కసారిగా ఎలా ఎదిగారు? వ్యాపారంలో ఎలా రాణించారు.. అనేదాని గురించి ఈ పుస్తకంలో వెల్లడించారు. అయితే.. రామ్దేవ్ బాబాను అవమానించే రీతిలో ఈ పుస్తకంలో రాశారన్న నెపంతో ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు.
ఈ పుస్తకాన్ని ఆనంద్ యాదవ్ రచించారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. మహారాష్ట్రకు చెందిన పండితుడు భక్త తుకారం, అదే రాష్ట్రానికి చెందిన మరో పండితుడు, భగవాన్ స్వరూపుడు.. లోక్సఖ జ్ఞానేశ్వర్ జీవితాల గురించి రాసిన పుస్తకాలు అవి. ఈ పుస్తకాల్లో ఇద్దరు పండితులను అవమానిస్తూ రచయిత రాసారంటూ.. ఈ పుస్తకాల కాపీలను మొత్తం ఎవ్వరికీ కనిపించకుండా నాశనం చేయాలంటూ.. అప్పట్లో పూణె మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
అందుకే.. ఈ పుస్తకాలు మీకు ఎక్కడ కనిపించినా.. అస్సలు వదలకండి. వెంటనే ఇంటికి తెచ్చుకొని చదివేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గాంధీ జయంతి |1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
Kohinoor Diamond |కోహినూర్ వజ్రం గోల్కొండ కోట నుంచి బ్రిటన్ దాకా ఎలా వెళ్లింది?
కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ముద్రణ ఎప్పుడు మొదలైంది? బోసి నవ్వుల గాంధీ బొమ్మ ఎక్కడిది?