హైదరాబాద్ : అమెరికా తెలుగు సంఘం (ఆటా) 11వ మహిళా దినోత్సవాలు వర్జీనియా(Virginia )లో ఘనంగా జరిగాయి. ఈనెల 1 న చిన్మయ సోమ్నాథ్, చాంటిలి నగరంలో జరిగిన వేడుకలకు ఆటా(Aata) అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఉపాధ్యక్షులు జయంత్ చల్లా , పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11వ వార్షికోత్సవం ఎంబ్రాస్ ఈక్వాల్టీ (EmbraceEquity) థీం తో మహిళా(Women’s day) దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి సహకరించిన ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు, రీజనల్ డైరెక్టర్ కౌశిక్ సామ, రీజనల్ అడ్వయిజర్ సుధీర్ దామిడి, రవి చల్లా(కార్పోరేట్ స్పానర్స్షిప్ చైర్), రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి, అమర్ పాశ్య, హర్ష భరెంకబై, లోహిత్ రెడ్డి, మల్ల కాల్వ, రాము ముండ్రాతి (మీడియా కమిటీ చైర్) పాల్గొన్నారు. వీరితో పాటు అమర్ బొజ్జ, వెంకట్ వూట్కురి (స్పోర్ట్స్-రీజనల్ చైర్), అనిల్ బొయినపల్లి (బిజినెస్ కమిటీ మెంబర్), రాణా చెగు (బిజినెస్ కమిటీ అడ్వయిజర్), కిరణ్ పదెర( కమ్యూనిటీ సర్వీసెస్-రీజనల్ చైర్), పవన్ గోవర్ధన(మెంబర్ బెంఫిట్స్), అనిల్ కాశినేని(మెంబర్ రిసోర్సెస్-చైర్), నవీన్ రంగ(ఎడ్యుకేషన్ -మెంబర్), ప్రవీణ్ దాసరి (పబ్లిసిటీ-చైర్), శ్రీధర్ సన (స్పోర్ట్స్-చైర్), సంజయ్ నాయుడు (వెబ్&టెక్నొలజీ-కో-చైర్) హాజరయి వేడుకలను విజయవంతం చేశారు.