హైదరాబాద్: అమెరికాలోని మిచిగాన్ స్టేట్ సాగినాలో సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట వైభవోపేతంగా జరిగింది. మూడురోజులపాటు ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధనలతోపాటు సాయిబాబా, దత్తాత్రేయ, నవగ్రహ హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మురళీ గింజుపల్లి మాట్లాడుతూ.. జనవరిలో నలుగురు స్నేహితులు కలిసి సాయి బాబా ధ్యానమందిరాన్ని ప్రారంభించారని, ఎనిమిది నెలల్లో అది దేవాలయంగా రూపుదిద్దుకుందని చెప్పారు.
వేమూరి నీలిమ-శ్రీనివాస్ దంపతులు సాయిబాబా విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారని వెల్లడించారు. ఆలయ నిర్వహణలో సహకరించిన శ్రీనివాస్ వేమూరి, హరిచరణ్ మట్టుపల్లి, శ్రీధర్ గింజుపల్లి, సాంబశివరావు, కొర్రపాటి, లీలా పాలడుగు, లక్ష్మి మట్టుపల్లి, కృష్ణ జన్మంచిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయంలో ప్రతి గురువారం ప్రవాస భారతీయులంతా కలిసి సాయిబాబా హారతులు, భజనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయం నిర్మిస్తామన్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నదానం చేశామన్నారు.
‘బ్రహ్మశ్రీ’ భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) ఆధ్వర్యంలో మూడురోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో నీలిమ శ్రీనివాస్ వేమూరి, సెల్వి విష్ణు కుమార్, తనూజ శ్రీనివాస్ వడ్డమాని, మోనికా మహేష్ భుతి, పల్లవి అమిత్ షహసానె, రోహిణి జితేంద్ర వైద్య, శుభ రఘు మెల్గిరి, కల్పన మురళీ తమ్మినాన, సుజని మురళీ గింజుపల్లి, హేమమాలిని మహేష్ సమతం, నిఖిత రాహుల్ గుప్తా, డాక్టర్ కేపీ కరుణాకరన్, లక్ష్మి, రఘురాం సర్వేపల్లి, నరేంద్రకుమార్, కిశోర్ బాబు, సామ్రాజ్యం కొండపనేని, సుబ్బారావ్, వాణి శ్రీ చావలి, సుబ్రహ్మణ్యం, సుందర యాదం, అనిరుధ్, విద్య భండివార్, విజయా రావ్తో పాటు సుమారు 8 వందల మంది భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.