US Congress Men applauds Raghu Reddy | శాంతాక్లారా కమిషనర్ కాకి రఘురెడ్డిని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ప్రశంసల్లో ముంచెత్తారు. కాలిఫోర్నియాలోని ఒక కౌంటీ కమిషనర్గా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులు కావడం ఇదే మొదటి సారి. చారిత్రకంగా ఈ స్థానాన్ని అమెరికన్లతోనే భర్తీ చేస్తారు. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ తెలంగాణకు చెందిన కాకి రఘురెడ్డి.. శాంతా క్లారా కౌంటీ కమిషనర్గా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా రోఖన్నా మాట్లాడుతూ చాలా మంది భారతీయులు ప్రజా, రాజకీయ జీవితంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. భారతీయులు ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ రంగాల్లో మరింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారని అన్నారు.
మిల్పిటాస్ సిటీ, శాంటాక్లారా కౌంటీల్లో సుదీర్ఘకాలం సేవలందించడంలో నిబద్ధతకు మారుపేరు రఘురెడ్డి అని రోఖన్నా ప్రశంసల్లో ముంచెత్తారు. మిల్పిటాస్ సిటీ కమిషనర్గా రఘురెడ్డి పని చేస్తున్నప్పటి నుంచి తనకు పరిచయం అని తెలిపారు. అప్పటికి తాను అమెరికా కాంగ్రెస్కు ఎన్నికవ్వలేదని గుర్తు చేసుకున్నారు.
వ్యూహాత్మక అలయెన్స్పై కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఈ వారం ప్రారంభంలో భారత్-అమెరికా భాగస్వామ్యం నిర్వహించిన సదస్సుకు రోఖన్నా, రఘురెడ్డి హాజరయ్యారు. వివిధ భారతీయ సంస్థల సాయంతో అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారత సంతతి సభ్యుడు రో ఖన్నా. అమెరికా కాంగ్రెస్కు రో ఖన్నా ఎన్నికయ్యేందుకు సహకరించిన వారిలో మేయర్లు, కమిషనర్లు, కౌన్సిల్ సభ్యులు, వివిధ భారతీయ సంస్థలు, ఇతర సంస్థల ఆఫీస్ బేరర్లు ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో రఘురెడ్డి జన్మించారు. అమెరికాలో స్థిరపడటానికి ముందు భారత్లోని వివిధ ప్రాంతాల్లో పని చేశారు.