హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు సౌత్ ఆఫ్రికా శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.