మునుగోడులో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాకర్ రెడ్డిని అశీర్వదించి , గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ విజయం చూసి అయినా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు , ప్రజా ప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు పట్టించుకోరని. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుండి రాష్ట్రానికి దక్కాల్సిన పన్ను వాటాలు, పైసల గురించి పోరాడాలని పేర్కొన్నారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని రూ. 18 వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన స్వార్థపరుడు రాజగోపాల్ రెడ్డికి, అతని డబ్బు అహంకారానికి మునుగోడు ప్రజలు సరైన గుణపాఠం చెప్పేలా చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారన్నారు సతీష్ కుమార్. ఈ విజయం బీఆర్ఎస్ జైత్రయాత్రకు తొలి మైలురాయి అవుతుందని, మునుగోడు ఫలితం దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతోందని అన్నారు. ఒకప్పుడు తాగునీటి కోసం గోసపడిన మునుగోడు నియోజకవర్గానికి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించి, ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమపారని కొనియాడారు.
8 ఏండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను మెచ్చిన ప్రజలు టీఅర్ఎస్ వెంటే ఉన్నామని చాటారు. మనుగోడు అభివృద్ధి కి పట్టంకడుతూ ఉప ఎన్నికలో టీఅర్ఎస్ అభ్యర్థిని స్పష్టమైన మెజారిటీతో ఎన్నుకోవడం శుభపరిమాణం. కేసీఆర్ఆలోచన, ఆచరణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని మునుగోడు ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టిన మునుగోడు ప్రజలకు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మంత్రులు, ప్రజా పతినిధులు, తెరాస సైనికులకు పేరు పేరున ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు సతీష్ కుమార్.