హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు. కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని నీచమైన చర్యగా పేర్కొన్నారు. కవితను ఎదుర్కొనే శక్తి లేక బీజేపీ నాయకులు ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబం వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని సతీశ్ కుమార్ పేర్కొన్నారు.