హైదరాబాద్ : ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలంకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి వరించడం పట్ల ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం ఉద్యమకారుడికి దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ను స్థాపించిన అనిల్.. తెలంగాణ వాదాన్ని ఖండాంతరాలకు తెలియజేశారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన సతీష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.