హైదరాబాద్ : వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్(Chandramohan)కు అంతర్జాల మాధ్యమంగా(internet platform) సంస్మరణ సభ నిర్వహించి ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. తాను రాసిన మొట్టమొదటి గీతం చంద్రమోహన్ సినిమాకే రచించానని తెలియజేశారు.
నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం వంశీ ప్రచురణగా చంద్రమోహన్ నటనా వైదుష్యాన్ని తెలియజేస్తూ 120 సినిమా సమీక్ష వ్యాసాలతో ప్రచురింపబడిన ‘సినితెర చంద్రమోహనం’ పుస్తకాన్ని తీసుకొచ్చామన్నారు. అందులో చంద్రమోహన్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే పలు విషయాలు ఉన్నట్లు వారు తెలిపారు.