కాలిఫోర్నియా: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డినే గెలిపించాలని.. సూర్యాపేటలో జన్మించి, అమెరికాలోని కాలిఫోర్నియా నగర కమిషనర్ అయిన భారత సంతతి వ్యక్తి రఘు రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలతో పోల్చిచూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపట్ల నిబద్ధతతో ఉన్నదని, కాబట్టి స్థానిక ఓటర్లు టీఆర్ఎస్కు మద్దతుగా నిలువడం తెలివైన నిర్ణయమని ఆయన సూచించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మునుగోడు అభివృద్ధి బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకుంటారని.. కాబట్టి కేటీఆర్, జిల్లా ఇన్చార్జి మంత్రి జగదీశ్రెడ్డిల చేతులకు మరింత బలం చేకూర్చేలా అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయాలని రఘు రెడ్డి కోరారు. కాలిఫోర్నియా నగరానికి తొలి భారత సంతతి కమిషనర్గా మంత్రులు కేటీఆర్ను, జగదీశ్రెడ్డిని తాను కలిశానని, వారు ఎంత నిబద్ధత, అంకితభావం, చలనశీలత కలిగిన వ్యక్తులో గమనించానని చెప్పారు.
కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంతో చూడాలని రఘు రెడ్డి అక్కడి ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.