తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ఇవాళ రాత్రికి ప్రదర్శించడం చారిత్రాత్మకం అని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని పేర్కొన్నారు.
ఈ సంద్భంగా నందిని మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో బతుకమ్మ ఎప్పుడో విశ్వవ్యాప్తం అయిందన్నారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన సాంస్కృతిక వైభవాన్ని మరింత పెంపొందిస్తుంది అన్నారు. ఈ ప్రదర్శన నిమిత్తం దుబాయ్కు విచ్చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత, జాగృతి రాష్ట్ర నాయకులు, అన్ని దేశాల తెలంగాణ జాగృతి శాఖల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ప్రవాస మిత్రులకు తెలంగాణ జాగృతి ఖతర్ తరఫున సహృదయ స్వాగతం పలుకుతున్నామని నందిని తెలిపారు.