లండన్ : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ 75 ఏండ్ల స్వత్రంత్ర భారత్ సంబరాల్లో భాగంగా.. లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఏఎఫ్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ నలుమూలల నుంచి వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరిని ఆహ్వానించారు.
ఇండియాలో ఈ 75 ఏండ్ల లో సాధించిన మహిళా సమూలాభివృద్ధి, వారికి అందించాల్సిన ప్రోత్సాహంగురించి సెషన్స్ ఏర్పాటు చేసారు. ఇందులో చేనేత, గొల్లభామ, పెంబర్తి, నిర్మల్ బొమ్మలని ప్రచారం చేస్తూ ఈ సంవత్సరం కరీంనగర్కి నిలలమైన ఫిలిగ్రి వెండి కళలని ప్రోత్సహించి ప్రచారం చేయాలని నిర్ణయించారు.
కాగా, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ కోర్ కమిటీ సభ్యులు మీనా అంతటి, గంప జయశ్రీ, శౌరి గౌడ్ సమర్థవంతంగా నిర్వహించారు.