ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ సంబురాల్లో ముఖ్యమైన బోనాల(Bonalu) పండుగను అమెరికాలోని న్యూయార్క్(Newyork)లో వైభవంగా జరుపుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA) అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గడ్డం ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ సందడిని తలపిస్తూ కింగ్స్ పార్క్లో బోనాలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ కల్చరల్ మార్చ్కు సుంకేన్ మిడో స్టేట్పార్క్ ఆత్మీయ వేదికగా నిలిచింది. తెలంగాణ గుండె చప్పుళ్లు, ఆట,పాటలతో దద్దరిల్లింది.
పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రవాస తెలుగు బిడ్డలే కాకుండా భారతీయులు (Indians), అమెరికన్లు(Americans) సైతం బోనాలకు తిలకించి పులకరించారు. తెలుగదనం ఉట్టిపడేలా డప్పుచప్పుళ్లతో బోనాల ఊరేగింపు కార్యక్రమంతో పాటు అమ్మవారికి బోనాల సమర్పణ వరకు ప్రతీ ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ వంటకాలు( Telangana Cuisine)ఘుమఘమలాడాయి. కౌంటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జాన్ కైమన్, డైవర్సిటీ ఔట్ రీచ్ సఫోల్క్ కౌంటీ డైరెక్టర్ మోహీందర్ సింగ్ తనేజా, డాక్టర్ పైలా మల్లారెడ్డి, సాధనారెడ్డి, డాక్టర్ భారతీరెడ్డి, డాక్టర్ రామురెడ్డి, డాక్టర్ సుధాకర్, విడియాల, గీతా విడియాల, బాజీ సూరపనేని, భాగ్య సూరపనేని తదితర ప్రముఖులకు వేడుకలకు హాజరు కావడం విశేషం.
NYTTA సంఘం చైర్మన్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గడ్డం, వైస్ -ప్రెసిడెంట్ వాణీ సింగరికొండ, కోశాధికారి రవీందర్ కోడెల, ఉపకోశాధికారి ప్రసన్న మధిర, కార్యదర్శి గీతా కంకణాల, ఉపకార్యదర్శి హారిక జంగం, పద్మ తాడూరి, హరిచరణ్ బొబ్బిలి తదితరుల సారథ్యంలో బోనాలను విజయవంతం చేశారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సతీష్ కాల్వ, ఉషారెడ్డి మన్నెం, సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి, పవన్ రవ్వ, మల్లిక్ రెడ్డి అక్కినపల్లి, డాక్టర్ వేణుగోపాల్ పల్లా, డాక్టర్ కృష్ణ బాధే , రమా కుమారి వనమా అడ్వయిజరీ కమిటీ చినబాబు రెడ్డి, మధుసూధన్ రెడ్డి, ప్రదీప్ సామల మరియు శ్రీనివాస్ గూడూరు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యూయార్క్ స్థానిక, జాతీయ సంస్థలు,టీటీఏ( TTA ), (TLCA ), (TANA) ల నేతలు, ప్రతినిధులు వేడుకలలో పాల్గొన్నారు.