తిరుమత : టీటీడీ, ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో శ్రీనివాస కల్యాణం ఆదివారం తెల్లవారుజామున కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో స్వామివారి కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణోత్సవం ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను పండితులు పుణ్యాహవాచనం నిర్వహించారు. శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని భక్తులు నేత్రపర్వంగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని 8 రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యాన కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నారు. 19న సియోటెల్,25న డల్లాస్, 26, సేయింట్ లూయిస్, 30న చికాగో, జులై 2న న్యూ ఆర్లీన్స్, 3న వాషింగ్టన్, 9న అట్లాంటాలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.