ఆస్ట్రేలియా : బ్రిస్బేన్ తెలంగాణ సమాజం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న స్థానిక స్ట్రాత్పైన్ కమ్యూనిటీ హాలులో
శ్రీ సీతారాముల కల్యాణం అట్టహాసంగా జరిగింది. రాములోరి కల్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితులు వంశీ సీతం రాజు, దుర్గ కర్ర, రామకృష్ణ బొలుసు, శ్రీకృష్ణ రావిపాటి వారిచే అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం జరిపించారు. గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం వారు కూడా స్వామి కల్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానకం, వడపప్పు, అన్నదాన వితరణ జరిగినట్లు సెక్రటరీ కిషోర్ కత్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కల్లెం, శ్రీకాంత్ సాదం, ప్రభాకర్ బచ్చు, శివ నాగ్ పుర్కర్, కనక రాజు, తదితరులు పాల్గొన్నారు.