సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) వార్షిక చండీ హోమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించిన చండీ హోమ మహోత్సవంలో సుమారు 350 మంది భక్తులు పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదాలను అందుకున్నారు.
దేవి అనుగ్రహం కోసం ఈ చండీ హోమాన్ని సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 30 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తోంది. కార్యక్రమం గణపతి పూజ, కలశ స్థాపనతో చండీ హోమం ప్రారంభమైంది. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం నిర్వహించారు. తదుపరి కవచ, అర్గళ, కీలక పఠనాలు చేసి, ఉత్సాహభరితమైన దేవీ మహాత్మ్యం పరాయణ హోమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సుహాసిని పూజ కూడా నిర్వహించారు. పూర్ణాహుతి, దీపారాధన, ఉపచార పూజలతో కార్యక్రమం ముగిసింది. చండీ హోమం సందర్భంగా ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోయింది.
హోమం అనంతరం వాలంటీర్లను సభ నిర్వాహకులు సన్మానించారు. అలాగే ప్రాథమిక, మాధ్యమిక, విశ్వవిద్యాలయ విద్యలో ప్రతిభ కనబరిచి విద్యార్థులను ఎడ్యుకేషన్ మెరిట్ అవార్డులతో సత్కరించారు. చివరగా భక్తులందరికీ పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SDBBS అధ్యక్షులు కార్తిక్, కార్యదర్శి బాలాజీ రామస్వామి, ఈవెంట్ లీడ్ సాయి రామ్ కల్యాణ సుందరం సభ పురోహితులు విజయ్, కన్నన్, కార్తీక్లకు అలాగే కార్యక్రమానికి తోడ్పడిన అందరి వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.