తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే దాస్యం వినయ్భాస్కర్, తూర్పు ఎమ్మెల్లే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన వారి వారి నియోజక వర్గాల్లో సోమవారం పిల్లలందరికీ అందజేశారు.
ఈ కార్య క్రమంలో టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగాల అరుణ్, జీవన్కుమార్, సందీప్కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, తదితరులు పాల్గొన్నారు.