లండన్ : వరంగల్ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై యూకే ( BRS London ) నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతు సంగ్రామ సభ పోస్టర్ ( Poster ) ను లండన్లో ఆవిష్కరించారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి( Naveen Reddy ) మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో, రైతు భరోసాలో, రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమయ్యిందన్నారు.
రైతులు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హరి గౌడ్, రవి రెటీనేని, సత్య చిలుముల, రవి పులుసు, అంజన్ రావు, పవన్ కళ్యాణ్, తరుణ్ లునావత్,అజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.