NRI News | గుజరాత్ జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న భారత సంతతి దంపతులను అప్పగింతకు బ్రిటన్ న్యాయస్థానాలు నిరాకరించాయి. భారత ప్రభుత్వం అభ్యర్థించినా ససేమిరా అన్నాయి. కమర్షియల్ విమానాల్లో సిడ్నీ నుంచి లండన్కు రూ.600 కోట్ల విలువైన కొకైన్ తరలిస్తున్నారన్న అభియోగం, హవాలా లావాదేవీల కేసులో దోషులుగా నిర్ధారించారు. నైరోబీలో జన్మించిన భారత సంతతి బ్రిటిష్ పౌరురాలు ఆర్తి ధీర్ (59), ఆమె భర్త కవల్జిత్ సింగ్ రైజాడా (35)లు లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి 514 కిలోల కొకైన్ తరలించారు. దీనిపై కేసు దర్యాప్తు చేసిన నేషనల్ దర్యాప్తు సంస్థ అధికారులు.. ఈ కొకైన్ తరలించిన సంస్థ వెనుక ఉన్నది వీరిద్దరేనని నిర్ధారణకు వచ్చింది.
2021 మేలో సిడ్నీలో కొకైన్ ప్యాకెట్లను ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తనిఖీ చేసినప్పుడు తీగ లాగితే డొంకంతా కదిలినట్లు దీర్,రైజాడ జాడ కనుగొన్నారు. స్మగుల్డ్ వస్తువుల రవాణాకు ఉపయోగించేలా వైఫ్లయ్ ఫ్రైట్ సర్వీసెస్ అనే పేరుతో ఈ జంట ఏర్పాటు చేసిన కంపెనీకి ఈ కొకైన్ ప్యాకెట్లు చేరాయని అధికారులు గుర్తించారు. సదరు కొకైన్ ప్యాకెట్లపై రైజాడ ఫింగర్ ప్రింట్స్ సరిపోయాయని తెలిపారు.
ఇక బ్రిటన్ ఎన్సీఏ అధికారుల దర్యాప్తులో వారింట్లో లక్షల కొద్దీ పౌండ్లు బయట పడ్డాయి. ఈ ఆరోపణలను ధీర్, రైజాడా నిరాకరించినా అక్రమ ఎగుమతుల కేసులో 12 కౌంట్లు, హవాలా లావాదేవీల కేసులో 18 కౌంట్ల జైలుశిక్షను విధించింది సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు. ధీర్, రైజాడ దంపతులు చట్ట విరుద్ధంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనంపై ఎన్సీఏ అధికారులు ఫోకస్ పెట్టారు.