హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆంక్షలకు అనుగుణంగా ఉందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. ఎనిమిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎనలేని పురోగతి సాధిస్తుందన్నారు. ప్రభుత్వం, సమర్థ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు ప్రగతి ఫలాలు అందివస్తున్నాయన్నారు. ఈ బడ్జెట్లో చూసుకుంటే నీటిపారుదల రంగానికి, వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారన్నారు.
విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించారని, ఈ కేటాయింపులతో విద్యారంగంలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ఊరూ – మన బడి కార్యక్రంమ అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంన్నారు. అన్ని వర్గాల కలలు సాకారం చేసే బడ్జెట్ ఆమోదించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన మహేశ్ బిగాల.. బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.