నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓ ఎన్నారై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ సౌతాఫ్రియా ఎన్నారై శాఖ సభ్యుడు శివకుమార్ యాదవ్ కట్టబోయిన.. వెల్మగూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని చెప్పారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ.. పెద్దవూర మండల వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన అందరికి ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.