లండన్ : నిరుపేదల ఆశాజ్యోతి నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం అని ఎన్నారై టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి ఆధ్వర్యంలో దివంగత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగానోముల చిత్రపటానికి పూల మాలలు వేసి ఘాన నివాళిలుఅర్పించారు.
ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడిన నోముల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్ జెల్ల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, సతీష్ రెడ్డి బండా, అశ్విన్ కుమార్ ఐర్పుల్ల, చైతన్య ప్రసాద్ రెడ్డి చాకుర్షే, సైది రెడ్డి, నరేష్, సురేష్ పాల్గొన్నారు.