MYTA Bathukamma : మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగింది. ఆద్యండం సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి భారత హై కమీషనర్ బీఎన్ రెడ్డి(BN Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత పన్నెండు సంవత్సరాలుగా మలేషియాలో ‘మైటా’ చేస్తున్న సహకార కార్యక్రమాలను, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న పండుగలను కార్యక్రమాలను ఆయన అభినందించారు. సరిహద్దులు దాటి వచ్చినా కూడా మన సాంప్రదాయాన్ని కొసాగించడం.. పెద్దఎత్తున 150 పైగా బతుకమ్మలు పేర్చి ఆడడం, 2,000లకు పైగా మంది సమూహంతో చిన్నపాటి తెలంగాణను తలపిస్తుంది అని బీఎన్ రెడ్డి కొనియాడారు.
బతుకమ్మ సంబురాలకు తెలంగాణ ఎంఎల్సీ మహేందర్ రెడ్డి హాజరైన మరో అతిథి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మైటా చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆసియా ఫసిఫిక్ సుందరి రష్మీ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తెలంగాణ జానపద గాయని కుమారి నాగలక్ష్మి తనదైన పాటలతో అలరించారు.
డాన్స్ మాస్టర్ నరేష్ ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు తెలంగాణ జానపద పాటలకు చేసిన నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పన్నెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మైటా ఆధ్వర్యంలో కౌలలంపూర్లో నూతనంగా ఒక ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు.
బతుకమ్మ ఆడుతున్న మహిళలు, చిన్నారులు
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి కృతజ్ఞతలు తెలిపారు. జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు, జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి, అడ్వైసరీ మెంబర్స్ గురిజాల అమర్నాథ్ గౌడ్, సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.