కువైట్ సిటీ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కువైట్ ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షురాలు అభిలాష మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో కువైట్ ఎన్నారై టీఆర్ఎస్ కమిటీ సభ్యులు రవి గన్నరపు, సురేష్ గౌడ్, జగదీశ్, సుభాన్, రవి సుధగాని, సమియుద్దీన్, జమీల్, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు.